E-Paper
Advertisement

Godavari Express: ప్రయాణీకుడికి గుండెపోటు, కాజీపేట స్టేషన్ లో నిలిచిపోయిన గోదావరి ఎక్స్ ప్రెస్!

Godavari Express: ప్రయాణీకుడికి గుండెపోటు, కాజీపేట స్టేషన్ లో నిలిచిపోయిన గోదావరి ఎక్స్ ప్రెస్!
Advertisement

Godavari Express Passenger Death:

ప్రయాణీకులను సేఫ్ గా గమ్యస్థానాలకు చేర్చడంలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా ప్రయాణ సమయంలో ప్యాసింజర్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ప్రయాణీకుడు తీవ్ర ఆనారోగ్యానికి గురైతే అవసరం అయితే, రైలును నిలిపివేసేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ప్రయాణీకుడికి గుండెపోటు రావడంతో గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేశారు రైల్వే అధికారులు. కాజీపేట రైల్వే స్టేషన్ లో సుమారు గంట నుంచి ఆపివేశారు.

గుండెపోటుతో చనిపోయిన ప్రయాణీకుడు

ప్రయాణ సమయంలో గుండెపోటు రావడంతో రైల్వే సిబ్బంది అలర్ట్ అయ్యారు. కాజీపేట రైల్వే స్టేషన్ లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, పరిస్థితి విషమించడంతో సదరు ప్రయాణీకుడు స్టేషన్ రాకముందే ప్రాణాలు విడిచాడు. ఈ నేపథ్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ లో గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. రైల్వే డాక్టర్లు వచ్చి చెక్ చేసిన తర్వాతే బాడీని అప్పగిస్తామని చెప్పడంతో అధికారులు చెప్పారు. కానీ, డెడ్ బాడీ ఇవ్వాలని మృతుడి బంధువులు ఆందోళన చేశారు.  ఈ నేపథ్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సుమారు గంట నుంచి కాజీపేటలోనే రైలు నిలిచిపోయింది.

Advertisement

Read Also: ఇక ఆ 10 రైళ్లు తిరుపతి నుంచి కాదు తిరుచానూరు నుంచి నడుస్తాయట, ఎందుకంటే?

తీవ్ర ఇబ్బంది పడుతున్న ఇతర ప్రయాణీకులు

చాలా సేపటి నుంచి రైలు ఆగిపోవడంతో ఇతర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు, మహిళలలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు వీలైనంత త్వరగా ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టి, రైలు బయల్దేరేలా చూస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Advertisement

Read Also: ఇక ఆ 10 రైళ్లు తిరుపతి నుంచి కాదు తిరుచానూరు నుంచి నడుస్తాయట, ఎందుకంటే?

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×