E-Paper
Advertisement

Godavari Express: ప్రయాణీకుడికి గుండెపోటు, కాజీపేట స్టేషన్ లో నిలిచిపోయిన గోదావరి ఎక్స్ ప్రెస్!

Godavari Express: ప్రయాణీకుడికి గుండెపోటు, కాజీపేట స్టేషన్ లో నిలిచిపోయిన గోదావరి ఎక్స్ ప్రెస్!

Godavari Express Passenger Death:

ప్రయాణీకులను సేఫ్ గా గమ్యస్థానాలకు చేర్చడంలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా ప్రయాణ సమయంలో ప్యాసింజర్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ప్రయాణీకుడు తీవ్ర ఆనారోగ్యానికి గురైతే అవసరం అయితే, రైలును నిలిపివేసేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ప్రయాణీకుడికి గుండెపోటు రావడంతో గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేశారు రైల్వే అధికారులు. కాజీపేట రైల్వే స్టేషన్ లో సుమారు గంట నుంచి ఆపివేశారు.

గుండెపోటుతో చనిపోయిన ప్రయాణీకుడు

ప్రయాణ సమయంలో గుండెపోటు రావడంతో రైల్వే సిబ్బంది అలర్ట్ అయ్యారు. కాజీపేట రైల్వే స్టేషన్ లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, పరిస్థితి విషమించడంతో సదరు ప్రయాణీకుడు స్టేషన్ రాకముందే ప్రాణాలు విడిచాడు. ఈ నేపథ్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ లో గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. రైల్వే డాక్టర్లు వచ్చి చెక్ చేసిన తర్వాతే బాడీని అప్పగిస్తామని చెప్పడంతో అధికారులు చెప్పారు. కానీ, డెడ్ బాడీ ఇవ్వాలని మృతుడి బంధువులు ఆందోళన చేశారు.  ఈ నేపథ్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సుమారు గంట నుంచి కాజీపేటలోనే రైలు నిలిచిపోయింది.

Read Also: ఇక ఆ 10 రైళ్లు తిరుపతి నుంచి కాదు తిరుచానూరు నుంచి నడుస్తాయట, ఎందుకంటే?

తీవ్ర ఇబ్బంది పడుతున్న ఇతర ప్రయాణీకులు

చాలా సేపటి నుంచి రైలు ఆగిపోవడంతో ఇతర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు, మహిళలలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు వీలైనంత త్వరగా ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టి, రైలు బయల్దేరేలా చూస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Read Also: ఇక ఆ 10 రైళ్లు తిరుపతి నుంచి కాదు తిరుచానూరు నుంచి నడుస్తాయట, ఎందుకంటే?

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×