E-Paper
Advertisement

Potato Puri: మైదా పూరీ, గోధుమ పూరీనే కాదు ఓసారి ఆలూ పూరి ప్రయత్నించండి,ఇది క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది

Potato Puri: మైదా పూరీ, గోధుమ పూరీనే కాదు ఓసారి ఆలూ పూరి ప్రయత్నించండి,ఇది క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది
Advertisement
Potato Puri: అల్పాహారంలో ఎప్పుడూ మైదాతో చేసిన పూరీని లేదా గోధుమ పిండితో చేసిన పూరీని తింటున్నారా? ఒకసారి బంగాళదుంపలతో చేసిన ఆలూ పూరి ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే క్రిస్పీగా క్రంచిగా వస్తుంది. నిజానికి మైదాతో చేసిన పూరీ ఆరోగ్యకరమైనది కాదు. గోధుమపిండితోనే పూరీలు చేసుకోవాలి. ఇక్కడ మేము చెప్పినట్టు బంగాళదుంపలతో చేసే పూరీ ఒకసారి ప్రయత్నించండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది, కొత్తగా కూడా ఉంటుంది. ఈ బంగాళదుంప పూరిని వెజ్ కుర్మాతో తింటే రుచి అదిరిపోతుంది. అలాగే చికెన్ కర్రీ తో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఎలా తినాలన్నది మీ ఇష్టమే.

ఆలూ పూరీ రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి – రెండు కప్పులు
బంగాళాదుంపలు – రెండు
నూనె – సరిపడినంత
పసుపు – పావు స్పూను
కారం – పావు స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా

Also Read: 40 ఏళ్లలో కూడా 20 ఏళ్ల లాగా కనిపించాలంటే.. ప్రతి రోజు ఇవి తినాల్సిందే !

ఆలూ పూరీ రెసిపీ
1. బంగాళదుంపలను ముందుగానే ఉడికించి తొక్క తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
2. చేత్తోనే ఆ బంగాళదుంపలను మెత్తగా మెదుపుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమపిండిని వేయాలి.
4. ఆ గోధుమ పిండిలోనే బంగాళదుంప ముద్దను పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
5. కలుపుతున్నప్పుడే రెండు స్పూన్ల నూనె కూడా వేయాలి.
6. ఈ మొత్తం మిశ్రమాన్ని పూరీ పిండిలాగా కలుపుకోవాలి. కావలసినంత నీటిని వేసుకోవాలి.
7. అలా ఇది చపాతీ పిండిలా కలిపాక పైన మూత పెట్టి పావుగంట పాటు పక్కన పెట్టేయాలి.
8. ఆ తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
9. ఈ లోపు పూరీ పిండి లోంచి చిన్న ముద్దను తీసి పూరీలా ఒత్తుకోవాలి.
10. దీన్ని వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే క్రిస్పీ ఆలూ పూరి రెడీ అయిపోతుంది.
11. ఇందులో మనం ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడాము.
12. కాబట్టి ఎన్ని తిన్నా పర్వాలేదు. మైదాపిండిని వాడకపోవడమే అని విధాలా ఉత్తమం.

Advertisement

ఈ ఆలు పూరీని ఎగ్ కీమా, చికెన్ కీమా, వెజ్ కుర్మా వంటి వాటితో తింటే రుచి అదిరిపోతుంది. అప్పుడప్పుడు కొత్తగా ఏదైనా తినాలనిపిస్తే ఈ ఆలూ పూరీలను ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతాయి. ముఖ్యంగా పిల్లలకు ఇవి నచ్చే అవకాశం ఎక్కువ. బంగాళాదుంపలతో చేసిన ఆహారాలు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. బంగాళాదుంపల్లో విటమిన్ సి, రిబోఫ్లైవిన్, కార్బోహైడ్రేట్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవే. చికెన్ వండుకున్నప్పుడు ఇలా ఆలూ పూరీ వండుకుని చూడండి, ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×