E-Paper
Advertisement

Scrub Typhus Cases: ఏపీలోని ఈ జిల్లాల్లో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. వామ్మో ఇంత ప్రమాదమా?

Scrub Typhus Cases: ఏపీలోని ఈ జిల్లాల్లో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. వామ్మో ఇంత ప్రమాదమా?

Scrub Typhus Cases: ఏపీలోని 26 జిల్లాల్లోనూ స్క్రబ్ టైఫస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు ఈ కేసుల సంఖ్య పెరగడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ వ్యాధిని ‘టిక్ లాంటి చిన్న కీటకం’ వ్యాపింపజేస్తుంది. ఇదిలా ఉంటే.. జనవరి 1 నుంచి నవంబర్ 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,678 అనుమానిత కేసులకు పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,317 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి ?
స్క్రబ్ టైఫస్ అనేది ‘ఓరియంటియా సుట్సుగముషి’ అనే రికెట్సియా కుటుంబానికి చెందిన బాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియాను మోసుకెళ్లే కీటకం (మైట్ లార్వా) కుట్టినప్పుడు మనిషిలోకి ఇది సంక్రమిస్తుంది.

లక్షణాలు:
కీటకం కుట్టిన ప్రదేశంలో మొదట నల్లటి మచ్చ (ఎస్చార్), దద్దుర్లు ఏర్పడతాయి. దీని తర్వాత.. వారం నుంచి పది రోజుల కాలంలో ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తాయి.

  • తీవ్రమైన జ్వరం, చలి
  • తలనొప్పి, కండరాల నొప్పులు
  • జీర్ణ సమస్యలు

సకాలంలో సరైన చికిత్స అందకపోతే.. పరిస్థితి తీవ్రమై తీవ్రమైన శ్వాసకోశ బాధ సిండ్రోమ్ , మెదడు, వెన్నెముక ఇన్ఫెక్షన్లు (మెనింజైటిస్), కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

జిల్లాల వారీగా కేసులు:
ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు.

చిత్తూరు- 379

కాకినాడ -141

విశాఖపట్నం- 123

ఇవే కాక.. వైఎస్ఆర్ కడప 94, నెల్లూరు 86, అనంతపురం 68, తిరుపతి 64, విజయనగరం 59, కర్నూలు 42, అనకాపల్లి 41, శ్రీకాకుళం 34, అన్నమయ్య 32, గుంటూరు 31, నంద్యాల 30  కేసులు నమోదయ్యాయి.

రోగ నిర్ధారణ & చికిత్స:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్యపై అవగాహన లోపించడం, సరైన సమయంలో గుర్తించకపోవడం మరణాలకు కారణమవుతోంది. జ్వరం తగ్గకపోతే.. సాధారణంగా మలేరియా, టైఫాయిడ్ లేదా డెంగ్యూ పరీక్షలు మాత్రమే చేస్తున్నారు.

జ్వరంతో పాటు శరీరంపై నల్ల మచ్చలు (ఎస్చార్) లేదా దద్దుర్లు కనిపిస్తే.. వెంటనే ELISA పరీక్ష ద్వారా స్క్రబ్ టైఫస్‌ను నిర్ధారించుకోవడం మంచిది.

చికిత్స: స్క్రబ్ టైఫస్ సోకిన వారికి సాధారణ యాంటీబయాటిక్స్‌తో సులువుగా చికిత్స అందించవచ్చు.

మరణాల రేటు: సకాలంలో చికిత్స అందితే మరణాల రేటు 2% కంటే తక్కువగా ఉంటుంది. చికిత్స ఆలస్యమైతే.. రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.

వ్యాధి సంక్రమించే కాలం:
సాధారణంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండటం వల్ల ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నివారణ చర్యలు:
ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించనప్పటికీ.. కీటకం కుట్టిన వ్యక్తి అనారోగ్యం పాలవుతారు.  కాబట్టి.. జాగ్రత్తలు తప్పనిసరి.

శరీరాన్ని కప్పి ఉంచడం: తడి నేలలు, పొదలు, తోటలు, పొలాలు, పశువుల కొట్టాలు, వ్యర్థాలు పేరుకుపోయే ప్రదేశాలలో పనిచేసే వ్యక్తులు పూర్తి చేతుల షర్ట్ , ప్యాంటు, సాక్స్, షూ ధరించాలి.

పిల్లల రక్షణ: పిల్లలు ఆరుబయట ఆడుకునేటప్పుడు కాళ్ళు , చేతులను కప్పి ఉంచే బట్టలు ధరించడం ద్వారా వారిపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదాన్ని తగ్గించాలి.

ఇంటి పరిశుభ్రత: ఇళ్లలోని పాత  పరుపులు, దిండ్లను మార్చాలి లేదా వాటిని ఉపయోగించే ముందు శుభ్రం చేయాలి. ఎందుకంటే ఈ కీటకాలు వాటిలో ఆశ్రయం పొందే అవకాశం ఉంది.

జ్వరం, నల్ల మచ్చలు లేదా దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించి స్క్రబ్ టైఫస్ కోసం పరీక్ష చేయించుకోవడం అత్యవసరం

 

Related News

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

Big Stories

×