E-Paper
Advertisement

Kidney Breakthrough: ఇక డయాలసిస్ అవసరం ఉండదా ? కిడ్నీలను పునరుజ్జీవింపజేసే కొత్త ట్రీట్మెంట్

Kidney Breakthrough: ఇక డయాలసిస్ అవసరం ఉండదా ? కిడ్నీలను పునరుజ్జీవింపజేసే కొత్త ట్రీట్మెంట్
Advertisement

Kidney Breakthrough: కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే కోట్లాది మందికి ఊరటనిచ్చే ఒక అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాధారణంగా కిడ్నీలు దెబ్బతింటే వాటిని మళ్లీ మునుపటి స్థితికి తీసుకురావడం అసాధ్యమని ఇప్పటి వరకు అందరు భావించే వారు. కానీ.. శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన పరిశోధనల్లో కిడ్నీ డ్యామేజ్‌ను రివర్స్ చేసే (మళ్లీ ఆరోగ్యంగా మార్చే) ఒక సులభమైన మార్గాన్ని కనుగొన్నారు.

సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యుఎస్ మెడికల్ స్కూల్, జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. వారి పరిశోధన ప్రకారం.. కిడ్నీలు దెబ్బతినడానికి ప్రధాన కారణం ‘ఇంటర్ ల్యూకిన్-11’ (IL-11) అనే ప్రోటీన్.

Advertisement

మన శరీరంలో ఏదైనా గాయం అయినప్పుడు లేదా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఈ ప్రోటీన్ ప్రతిస్పందిస్తుంది. అయితే.. కిడ్నీల విషయంలో ఈ ప్రోటీన్ అతిగా విడుదలైనప్పుడు అది కిడ్నీ కణజాలంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీని వల్ల కిడ్నీల్లో వాపు, మచ్చలు ఏర్పడి, కిడ్నీలు పని చేయడం ఆగిపోతాయి.

శాస్త్రవేత్తలు కనుగొన్న పరిష్కారం ఏంటి ?

Advertisement

శాస్త్రవేత్తలు ఈ IL-11 ప్రోటీన్ పని తీరును అడ్డుకునే ఒక ప్రత్యేకమైన యాంటీబాడీ చికిత్సను అభివృద్ధి చేశారు.

ప్రయోగం: ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ చికిత్స అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. దెబ్బతిన్న కిడ్నీ కణజాలం మళ్లీ పునరుజ్జీవనం చెందడాన్ని వారు గమనించారు.

ఫలితం: ఈ యాంటీబాడీని శరీరంలోకి పంపినప్పుడు.. అది కిడ్నీలలోని మచ్చలను తొలగించి, కొత్త కణాలు పుట్టేలా ప్రేరేపించింది. దీని వల్ల కిడ్నీ పని తీరు మళ్లీ మెరుగుపడింది.

ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యత:

ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్యూర్ సంభవిస్తే.. రోగులకు డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. కానీ ఈ కొత్త చికిత్స అందుబాటులోకి వస్తే..

డయాలసిస్ అవసరం తగ్గుతుంది: కిడ్నీలు సహజంగానే కోలుకుంటాయి కాబట్టి యంత్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

దీర్ఘకాలిక వ్యాధుల నివారణ: డయాబెటిస్, బీపీ వల్ల వచ్చే కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే అరికట్టవచ్చు.

ఖర్చు తగ్గుతుంది: కిడ్నీ మార్పిడి వంటి ఖరీదైన శస్త్ర చికిత్సల భారం తగ్గుతుంది.

ప్రస్తుతం ఈ ప్రయోగాలు క్లినికల్ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగాలు) దశలో ఉన్నాయి. ఇది గనక విజయవంతమైతే.. వైద్య చరిత్రలో ఇదొక విప్లవాత్మక మార్పు అవుతుంది. కిడ్నీ వ్యాధులు ఇకపై ప్రాణాంతకం కావని.. వాటిని మళ్లీ నయం చేయవచ్చని ఈ పరిశోధన నిరూపిస్తోంది.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×