BigTV English

Leftover Roti: రాత్రి మిగిలిపోయిన రోటీలను ఉదయం తింటున్నారా ? అస్సలు అలా చేయొద్దు

Leftover Roti: రాత్రి మిగిలిపోయిన రోటీలను ఉదయం తింటున్నారా ? అస్సలు అలా చేయొద్దు

Leftover Roti: రోటీలు మన భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం అని చెప్పొచ్చు. ప్రతి రోజు భోజనంలో రోటీలు తినే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. రోటీలు ఎల్లప్పుడూ శరీరానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇదిలా ఉంటే కొంత మంది మిగిలిపోయిన రోటీలను కొన్ని గంటల తర్వాత  తింటుంటారు. అంతే కాకుండా రాత్రి మిగిలిన రొట్టెలను ఉదయం తినే వారి సంఖ్య కూడా చాలానే ఉంటుంది.


ఆయుర్వేదం ప్రకారం.. తాజా ఆహారంతో పోలిస్తే చాలా కాలంపాటు నిల్వ ఉంచిన ఆహారం శరీరానికి హానికరం. ఎందుకంటే.. ఇది జీర్ణవ్యవస్థపై, శరీర మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆయుర్వేదంలో.. జీర్ణక్రియను “అగ్ని” అని పిలుస్తారు. ఇది శరీరం యొక్క మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. మిగిలిపోయిన రొట్టె తినడం వల్ల జీర్ణ శక్తి బలహీనపడుతుంది. అంతే కాకుండా ఇది వివిధ సమస్యలకు దారితీస్తుంది.

తాజా ఆహారంలో అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి శరీరంలో సరిగ్గా జీర్ణమవుతాయి. కాబట్టి ఆయుర్వేదం ప్రకారం మనం తినే ఆహారాన్ని తాజాగా ఉన్నప్పుడు తీసుకోవడం అవసరం. ఒక రోజు కంటే ఎక్కువ సమయం ఉంచిన రోటీలు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.


మిగిలిపోయిన రోటీలను తినడం వల్ల కలిగే నష్టాలు:

జీర్ణవ్యవస్థపై ఒత్తిడి:
ఆయుర్వేదం ప్రకారం.. మిగిలిపోయిన రొట్టె తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఎక్కువ సేపు ఉంచిన రొట్టెల యొక్క ఆకృతితో పాటు వాటిలోని పోషకాలు కూడా మారుతాయి. ఫలితంగా శరీరం వాటిని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. అంతే కాకుండా అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. మిగిలిపోయిన రొట్టెలో పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు ఇబ్బందిని కలిగిస్తాయి.

శరీరంలో విషపదార్థాలు:
మిగిలిపోయిన రొట్టె శరీరానికి హాని కలిగించే పదార్థాలను తయారు చేస్తుంది. మిగిలిపోయిన ఆహారం క్రమంగా శరీరంలో ఆమ్లత్వాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా శరీరంలో బలం, శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా త్వరగా అలసిపోయినట్లు కూడా అనిపిస్తుంది. ఇది చర్మ సమస్యలకు కూడా కారణం అవుతుంది.

వాపు , నొప్పి:
మిగిలిపోయిన రొట్టెలు తినడం వల్ల శరీరంలో వాపు కూడా వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఇలాంటి ఆహారం శరీరంలో వాత దోషాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ఇది శరీరంలో కీళ్ల నొప్పులు, వాపులకు కారణమవుతుంది. కీళ్ల సమస్యలు ఉన్నవారికి లేదా వాత దోషంతో బాధపడేవారికి ఇది హానికరం.

మానసిక ఆరోగ్యం:
మిగిలిపోయిన రొట్టెలు తినడం వల్ల మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది. అంతే కాకుండా ఇది విచారం, ఆందోళన , మానసిక అలసటకు కారణమవుతుంది. ఇది మానసిక స్థితిని మందగించేలా చేస్తుంది. ధైర్యం తగ్గడానికి దారితీస్తుంది. నిరాశకు కూడా కారణం అవుతుంది.

Also Read: మహిళల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. కనిపించే లక్షణాలివే !

బరువు పెరిగే ప్రమాదం:
మిగిలిపోయిన రొట్టెలు తినడం వల్ల ఇవి శరీరంలో అజీర్ణ సమస్యకు దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరగడానికి కారణమవుతుంది. మిగిలిన రొట్టెలో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది. ఇది శరీరం లోపల నిల్వ చేయబడుతుంది. ఫలితంగా శరీరంలో అధిక బరువుకు ఇది కారణం అవుతుంది.

Related News

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Big Stories

×