BigTV English
Advertisement

Leftover Roti: రాత్రి మిగిలిపోయిన రోటీలను ఉదయం తింటున్నారా ? అస్సలు అలా చేయొద్దు

Leftover Roti: రాత్రి మిగిలిపోయిన రోటీలను ఉదయం తింటున్నారా ? అస్సలు అలా చేయొద్దు

Leftover Roti: రోటీలు మన భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం అని చెప్పొచ్చు. ప్రతి రోజు భోజనంలో రోటీలు తినే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. రోటీలు ఎల్లప్పుడూ శరీరానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇదిలా ఉంటే కొంత మంది మిగిలిపోయిన రోటీలను కొన్ని గంటల తర్వాత  తింటుంటారు. అంతే కాకుండా రాత్రి మిగిలిన రొట్టెలను ఉదయం తినే వారి సంఖ్య కూడా చాలానే ఉంటుంది.


ఆయుర్వేదం ప్రకారం.. తాజా ఆహారంతో పోలిస్తే చాలా కాలంపాటు నిల్వ ఉంచిన ఆహారం శరీరానికి హానికరం. ఎందుకంటే.. ఇది జీర్ణవ్యవస్థపై, శరీర మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆయుర్వేదంలో.. జీర్ణక్రియను “అగ్ని” అని పిలుస్తారు. ఇది శరీరం యొక్క మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. మిగిలిపోయిన రొట్టె తినడం వల్ల జీర్ణ శక్తి బలహీనపడుతుంది. అంతే కాకుండా ఇది వివిధ సమస్యలకు దారితీస్తుంది.

తాజా ఆహారంలో అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి శరీరంలో సరిగ్గా జీర్ణమవుతాయి. కాబట్టి ఆయుర్వేదం ప్రకారం మనం తినే ఆహారాన్ని తాజాగా ఉన్నప్పుడు తీసుకోవడం అవసరం. ఒక రోజు కంటే ఎక్కువ సమయం ఉంచిన రోటీలు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.


మిగిలిపోయిన రోటీలను తినడం వల్ల కలిగే నష్టాలు:

జీర్ణవ్యవస్థపై ఒత్తిడి:
ఆయుర్వేదం ప్రకారం.. మిగిలిపోయిన రొట్టె తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఎక్కువ సేపు ఉంచిన రొట్టెల యొక్క ఆకృతితో పాటు వాటిలోని పోషకాలు కూడా మారుతాయి. ఫలితంగా శరీరం వాటిని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. అంతే కాకుండా అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. మిగిలిపోయిన రొట్టెలో పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు ఇబ్బందిని కలిగిస్తాయి.

శరీరంలో విషపదార్థాలు:
మిగిలిపోయిన రొట్టె శరీరానికి హాని కలిగించే పదార్థాలను తయారు చేస్తుంది. మిగిలిపోయిన ఆహారం క్రమంగా శరీరంలో ఆమ్లత్వాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా శరీరంలో బలం, శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా త్వరగా అలసిపోయినట్లు కూడా అనిపిస్తుంది. ఇది చర్మ సమస్యలకు కూడా కారణం అవుతుంది.

వాపు , నొప్పి:
మిగిలిపోయిన రొట్టెలు తినడం వల్ల శరీరంలో వాపు కూడా వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఇలాంటి ఆహారం శరీరంలో వాత దోషాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ఇది శరీరంలో కీళ్ల నొప్పులు, వాపులకు కారణమవుతుంది. కీళ్ల సమస్యలు ఉన్నవారికి లేదా వాత దోషంతో బాధపడేవారికి ఇది హానికరం.

మానసిక ఆరోగ్యం:
మిగిలిపోయిన రొట్టెలు తినడం వల్ల మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది. అంతే కాకుండా ఇది విచారం, ఆందోళన , మానసిక అలసటకు కారణమవుతుంది. ఇది మానసిక స్థితిని మందగించేలా చేస్తుంది. ధైర్యం తగ్గడానికి దారితీస్తుంది. నిరాశకు కూడా కారణం అవుతుంది.

Also Read: మహిళల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. కనిపించే లక్షణాలివే !

బరువు పెరిగే ప్రమాదం:
మిగిలిపోయిన రొట్టెలు తినడం వల్ల ఇవి శరీరంలో అజీర్ణ సమస్యకు దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరగడానికి కారణమవుతుంది. మిగిలిన రొట్టెలో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది. ఇది శరీరం లోపల నిల్వ చేయబడుతుంది. ఫలితంగా శరీరంలో అధిక బరువుకు ఇది కారణం అవుతుంది.

Related News

Vertigo Problem: రోజూ నిద్రలేవగానే తల గిర్రుమంటోందా.. వర్టిగో గురించి తెలియాల్సిన సమయమిదే!

 Ajwain Seed Water: వాము నీరు తాగితే.. నమ్మలేనన్ని లాభాలు !

Cracked Heels: మడమల పగుళ్లకు అసలు కారణాలు తెలిస్తే.. షాక్ అవుతారు

Rainbow Puri: రెయిన్‌బో పూరీ..ఇలా తయారు చేసుకుని తింటే అదిరిపోయే టేస్ట్

Kothmira Pachadi: నోరూరించే కొత్తిమీర పచ్చడి.. సింపుల్‌గా ఇలా తయారు చేయండి !

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Big Stories

×