E-Paper
Advertisement

COVID-19: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్! వారం రోజుల్లో 350 మంది మృతి..

COVID-19: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్! వారం రోజుల్లో 350 మంది మృతి..
Advertisement

COVID-19: మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వెయ్యికి పైగా కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత వారంలో 752 కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది. గతవారం అత్యధికంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో కొత్త ఇన్ఫెక్షన్లు నమోదైనట్లు వెల్లడించింది.

కేరళలో కొత్తగా 430 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం యాక్టివ్ కేసులు 430కి చేరుకున్నాయి. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, మహారాష్ట్రలో 209 యాక్టివ్ కేసులు ఉండగా..153 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఆ తర్వాత గుజరాత్ లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్ లో 15 కేసులు, పశ్చిమ బెంగాల్ లో 12 కేసులు నమోదయ్యయాయి.

Advertisement

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు.. వరుసగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా నోయిడాలో 9 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గణాంకాలే కాదు, కరోనా మరణాలు కూడా మరోసారి భయాన్ని పెంచాయి. అమెరికాలో కోవిడ్ 19 విజృంభిస్తోంది. వందల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా మరింత హానికరంగా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటివరకు సగటున.. వారానికి 350 వరకు కరోనా డెత్ కేసులు నమోదైనట్టు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) గణాంకాలు చెప్తున్నాయి.

ఇప్పటి వరకు దేశంలో కరోనాతో ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కోవిడ్ వైరస్ ఎటాక్ అయ్యి చనిపోయారు. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లించింది. గతంలో దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు వేయటం వల్లనే ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువగా ఉందని.. అనారోగ్యంతో ఉన్న వాళ్లకే ఇప్పుడు కరోనా ఎటాక్ అవుతుందని.. పెద్దగా ప్రభావం చూపించటం లేదని.. జనం భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య శాఖ స్పష్టం చేస్తోంది.

Advertisement

ఇటీవల ఆసియా దేశాలు మరీ ముఖ్యంగా హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోనూ కొవిడ్‌-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 వేరియంట్‌, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. జేఎన్‌.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్‌ ఆరోగ్యశాఖ తెలిపింది.

Also Read: ఆ బ్లడ్ గ్రూప్ వారికి కోవిడ్ ఇట్టే సోకుతుందా? అప్రమత్తం కాకుంటే అనర్థాలే!

ప్రస్తుతానికైతే.. కరోనా వైరస్ బారిన పడినవారిలో వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంది. కేవలం తక్కువ మందికి మాత్రమే.. హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎవరికైనా దజ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×