E-Paper
Advertisement

Vegetable Prices: కూరలు కుతకుత..అమాంతంగా పెరిగిన కూరగాయల ధరలు

Vegetable Prices: కూరలు కుతకుత..అమాంతంగా పెరిగిన కూరగాయల ధరలు
Advertisement
Vegetables Price Increased in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. రోజురోజుకు ధరలు పెరగడంతో సామాన్యుడికి అందకుండా పోతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు అన్ని రకాల ధరలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే..పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
సమస్య ఇదేనా
డిమాండ్ తగిన విధంగా ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయలు కుళ్లిపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీనికితోడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలను తెస్తున్న సమయంలో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. వర్షాలతో కూరగాయలు త్వరగా కుళ్లిపోవడంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. మరో వైపు రాష్ట్రంలో కూడా కూరగాయల సాగు తగ్గింది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి.
30 నుంచి 40 శాతం పెరిగిన ధరలు
ఏపీ, తెలంగాణలో కూరగాయ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. మార్కెట్ అవసరాలకు సరిపడా కూరగాయల ఉత్పత్తి జరగడం లేదు. దీంతో 30 నుంచి 40 శాతం వరకు కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఏ రకం కూరగాయాలు చూసిన రైతు బజారులోనే కిలో 60 నుంచి 80 వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్‌లో రైతు బజారులో కేజీ ఉల్లి రూ.35 ఉంటే..ఒపెన్ మార్కెట్‌లో రూ.40 నుంచి 45 వరకు పలుకుతుంది. టమాట కిలో రూ.40 నుంచి 50, పచ్చిమిర్చి రూ. 65 నుంచి 80, బీన్స్ రూ.110 నుంచి 120, చిక్కుడు రూ.50 నుంచి 60, బెండకాయ రూ.50 నుంచి 60 మధ్య ఉన్నాయి. ఆకుకూరలు సైతం రెట్టింపు అయ్యాయి.
మరో రెండు నెలల్లో..
ప్రస్తుతం వర్షా కాలం ప్రారంభం కానుంది. దీంతో రైతులు వానకాలం సాగు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన పంట జులై, ఆగస్టు మాసంలో చేతికి వస్తుంది. ఈ ఉత్పత్తులు మార్కెట్లకు చేరితే మళ్లీ కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
Tags

Related News

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

Big Stories

Advertisement
×