E-Paper
Advertisement

Vegetable pulao: నూనె అవసరం లేకుండా వెజిటబుల్ పులావ్ ఇలా చేసేయండి, ఇది ఎంతో హెల్తీ రెసిపీ

Vegetable pulao: నూనె అవసరం లేకుండా వెజిటబుల్ పులావ్ ఇలా చేసేయండి, ఇది ఎంతో హెల్తీ రెసిపీ
Advertisement

Vegetable pulao: నూనె వాడకుండా పులావ్, బిర్యానీలు చేయలేం అనుకుంటారు. చుక్క నూనె అవసరం లేకుండా రుచికరంగా పులావ్ ను వండుకోవచ్చు. ఇది ఆరోగ్యమైనకరమైన రెసిపీగా చెప్పుకోవాలి. ఊబకాయంతో బాధపడేవారు, డైటింగ్ లో ఉన్నవారు ఇలా ఆయిల్ లేని వెజిటేబుల్ పులావ్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీన్ని చేయడం చాలా సులువు. అరగంటలో దీన్ని వండేయచ్చు. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.

వెజిటబుల్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

Advertisement

బియ్యం – రెండు కప్పులు
క్యారెట్లు – రెండు
కాలీఫ్లవర్ ముక్కలు – అరకప్పు
బీన్స్ ముక్కలు – అర కప్పు
పాలు – ముప్పావు కప్పు
పసుపు – ఒక స్పూను
కారం – ఒక స్పూను
గరం మసాలా – ఒక స్పూను
లవంగాలు – మూడు
మిరియాలు – ఐదు
బిర్యానీ ఆకులు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
యాలకులు – నాలుగు
జాజికాయ – చిన్న ముక్క
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
జీడిపప్పులు – గుప్పెడు

వెజిటబుల్ పులావ్ రెసిపీ

Advertisement

వెజిటబుల్ పులావ్ కోసం బాస్మతి బియ్యాన్ని ఎంచుకోవాలి. ఈ బియ్యంతో పులావ్ టేస్టీగా వస్తుంది. అరగంట ముందే బాస్మతి బియ్యాన్ని నీళ్ళల్లో వేసి నానబెట్టాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి పాలు వేయాలి. పాలను వేడి చేయాలి. ఆ పాలు బాగా మరిగాక అందులో లవంగాలు, జాజికాయ ముక్క, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, మిరియాలు వేసి మరిగించాలి.

తర్వాత క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, బీన్స్ ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసి వేయించాలి. జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని పాలల్లో వేసి కలుపుకోవాలి. ఆ బియ్యం కడగడానికి సరిపడా నీటిని కూడా వేయాలి.

కుక్కర్ పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తరుగును పైన చల్లుకొని మూత పెట్టాలి. అంతే టేస్టీ వెజిటబుల్ పులావ్ రెడీ అయినట్టే. దీనిలో మనం ఆయిల్ వాడలేదు.. అయినా సరే ఇది అడుగంటకుండా టేస్టీగా వస్తుంది. పాలల్లో ఉండే వెన్న ఆయిల్ లాగా ఉపయోగపడుతుంది.

Also Read: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

నూనె లేని వంటకాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బిర్యానీ, పులావుల్లో అవసరానికి మించి ఆయిల్‌ని వేసి వండే వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి ఇలా పాలతో బిర్యాని చేసుకొని చూడండి. ఎంత రుచిగా ఉంటుందో. బిర్యానీ, పులావుల్లో పెరుగును వేయడం అందరికీ తెలిసింది. పెరుగుకు బదులు పాలను వేస్తే నూనె వేయాల్సిన అవసరం ఉండదు.

Related News

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

Big Stories

Advertisement
×