E-Paper
Advertisement

Kidney Disease: కిడ్నీలు పాడయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Kidney Disease: కిడ్నీలు పాడయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Kidney Disease: కిడ్నీలు మన శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. అవి రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థ పదార్థాలను, అదనపు ద్రవాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అంతేకాకుండా.. రక్తపోటును నియంత్రించడంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం ఈ విధులన్నీ ప్రభావితమవుతాయి. ప్రారంభ దశలో కిడ్నీ వ్యాధిని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన సమయంలో చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.

కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. కొన్నిసార్లు అసలు లక్షణాలే కనిపించకపోవచ్చు. అందుకే చాలా మందికి వ్యాధి ముదిరిన తర్వాతే అది ఉందని తెలుస్తుంది. కానీ.. ఈ మూడు ప్రారంభ లక్షణాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.

1. కిడ్నీలో మార్పులు:

మూత్రపిండాలు దెబ్బతింటే.. మూత్రవిసర్జన విధానంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. అవి..

తరచుగా మూత్రవిసర్జన: ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా మూత్రం వస్తుంది.

మూత్రంలో మార్పులు: మూత్రం రంగు మారడం, నురుగు లేదా బుడగలు ఎక్కువగా రావడం, లేదా మూత్రంలో రక్తం కనిపించడం.

మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా ఒత్తిడి: ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌కు కూడా సంకేతం కావచ్చు, కానీ మూత్రపిండాల సమస్యల వల్ల కూడా ఇలా జరగవచ్చు.

2. శరీరంలో వాపు (ఎడెమా):

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. అవి శరీరంలోని అదనపు ద్రవాలను బయటకు పంపలేవు. దీనివల్ల శరీరంలో ద్రవాలు పేరుకుపోయి వాపు వస్తుంది. ఈ వాపు ఎక్కువగా ముఖం, కళ్లు, కాళ్లు, చీలమండలు, చేతులలో కనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే కళ్ల కింద వాపు కనిపించడం ఒక ముఖ్యమైన లక్షణం.

Also Read: రోజుకో స్పూన్ పుచ్చకాయ గింజలు.. ఇన్ని ప్రయోజనాలా ?

3. అలసట, బలహీనత:

ఆరోగ్యకరమైన కిడ్నీలు ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటే.. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి రక్తహీనతకు దారితీస్తుంది. ఫలితంగా.. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక తీవ్రమైన అలసట, బలహీనత, ఏకాగ్రత లోపం, నీరసం కలుగుతాయి.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ముఖ్యంగా మధుమేహం లేదా అధిక రక్తపోటు ఉన్నవారు తరచుగా మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఈ రెండు వ్యాధులు మూత్రపిండాల సమస్యలకు ప్రధాన కారణాలు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే, జీవనశైలిలో మార్పులు, ఆహార నియమాలు, సరైన చికిత్స ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Related News

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

Big Stories

×