E-Paper
Advertisement

Kidney Disease: కిడ్నీలు పాడయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Kidney Disease: కిడ్నీలు పాడయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !
Advertisement

Kidney Disease: కిడ్నీలు మన శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. అవి రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థ పదార్థాలను, అదనపు ద్రవాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అంతేకాకుండా.. రక్తపోటును నియంత్రించడంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం ఈ విధులన్నీ ప్రభావితమవుతాయి. ప్రారంభ దశలో కిడ్నీ వ్యాధిని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన సమయంలో చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.

Advertisement

కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. కొన్నిసార్లు అసలు లక్షణాలే కనిపించకపోవచ్చు. అందుకే చాలా మందికి వ్యాధి ముదిరిన తర్వాతే అది ఉందని తెలుస్తుంది. కానీ.. ఈ మూడు ప్రారంభ లక్షణాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.

1. కిడ్నీలో మార్పులు:

Advertisement

మూత్రపిండాలు దెబ్బతింటే.. మూత్రవిసర్జన విధానంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. అవి..

తరచుగా మూత్రవిసర్జన: ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా మూత్రం వస్తుంది.

మూత్రంలో మార్పులు: మూత్రం రంగు మారడం, నురుగు లేదా బుడగలు ఎక్కువగా రావడం, లేదా మూత్రంలో రక్తం కనిపించడం.

మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా ఒత్తిడి: ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌కు కూడా సంకేతం కావచ్చు, కానీ మూత్రపిండాల సమస్యల వల్ల కూడా ఇలా జరగవచ్చు.

2. శరీరంలో వాపు (ఎడెమా):

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. అవి శరీరంలోని అదనపు ద్రవాలను బయటకు పంపలేవు. దీనివల్ల శరీరంలో ద్రవాలు పేరుకుపోయి వాపు వస్తుంది. ఈ వాపు ఎక్కువగా ముఖం, కళ్లు, కాళ్లు, చీలమండలు, చేతులలో కనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే కళ్ల కింద వాపు కనిపించడం ఒక ముఖ్యమైన లక్షణం.

Also Read: రోజుకో స్పూన్ పుచ్చకాయ గింజలు.. ఇన్ని ప్రయోజనాలా ?

3. అలసట, బలహీనత:

ఆరోగ్యకరమైన కిడ్నీలు ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటే.. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి రక్తహీనతకు దారితీస్తుంది. ఫలితంగా.. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక తీవ్రమైన అలసట, బలహీనత, ఏకాగ్రత లోపం, నీరసం కలుగుతాయి.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ముఖ్యంగా మధుమేహం లేదా అధిక రక్తపోటు ఉన్నవారు తరచుగా మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఈ రెండు వ్యాధులు మూత్రపిండాల సమస్యలకు ప్రధాన కారణాలు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే, జీవనశైలిలో మార్పులు, ఆహార నియమాలు, సరైన చికిత్స ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×