Independence Day:ఆగస్టు 15 వచ్చిందంటే టీవీల్లో ఒక సీన్ మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ప్రధాని జాతీయ జెండా ఎగరేయడం.. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం. ఏటా ఇదే చూస్తుంటాం.
కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ప్రధాని దేశంలో ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చు కదా.. మరి ఆగస్టు 15న ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారు?దీని వెనుక పెద్దగా ట్విస్ట్ ఏమీ లేదు. అసలు కథ 1947లోనే మొదలైంది.
మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు.అప్పటి నుంచి ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరేయడం ఒక సంప్రదాయంగా మారిపోయింది.
అంటే.. ఎవరో ఒక రోజు కూర్చొని “ఇక నుంచి ఇక్కడే చేయాలి” అని రూల్ పెట్టింది కాదు. స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజుతోనే ఈ సంప్రదాయం మొదలైంది.
ఎర్రకోట మామూలు బిల్డింగ్ కాదు. మన దేశ చరిత్రలో దానికి చాలా ప్రాధాన్యం ఉంది.మొఘలుల కాలం నుంచి బ్రిటిష్ పాలన వరకు ఎన్నో ముఖ్యమైన సంఘటనలకు ఎర్రకోట సాక్షిగా నిలిచింది.
అందుకే ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. బ్రిటిష్ పాలన ముగిసి, మన దేశం మన చేతుల్లోకి వచ్చిన రోజుకు ఎర్రకోట ఒక గుర్తుగా మారింది.
1947లో నెహ్రూ ఎర్రకోటపై జెండా ఎగరేసిన తర్వాత.. తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.ప్రతి ఆగస్టు 15న ప్రధాని ఎర్రకోటకు వెళ్తారు. జాతీయ జెండా ఎగరేస్తారు. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
దేశంలో ఏం జరుగుతోంది? ఇప్పటివరకు ఏం సాధించాం? ఇంకా ఏం చేయాలి? లాంటి విషయాల గురించి మాట్లాడతారు.
అది కూడా చేయొచ్చు. ప్రధాని దేశంలో ఎక్కడి నుంచైనా ప్రసంగించవచ్చు.కానీ ఆగస్టు 15 అంటే ఎర్రకోట గుర్తుకు రావడం.. ఎర్రకోట అంటే స్వాతంత్ర్య దినోత్సవం గుర్తుకు రావడం.. ఇలా రెండూ ఇప్పుడు బాగా కనెక్ట్ అయిపోయాయి.అందుకే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నెహ్రూ ఎర్రకోటపై జెండా ఎగరేశారు. ఆ తర్వాత ప్రతి ఏడాది అదే సంప్రదాయం కొనసాగింది.ఎర్రకోట కేవలం ఓ పాత కట్టడం కాదు.. స్వతంత్ర భారతదేశం కొత్త అధ్యాయం మొదలైన రోజుకు ఒక గుర్తు.
అది కూడా చేయొచ్చు. ప్రధాని దేశంలో ఎక్కడి నుంచైనా ప్రసంగించవచ్చు.కానీ ఆగస్టు 15 అంటే ఎర్రకోట గుర్తుకు రావడం.. ఎర్రకోట అంటే స్వాతంత్ర్య దినోత్సవం గుర్తుకు రావడం.. ఇలా రెండూ ఇప్పుడు బాగా కనెక్ట్ అయిపోయాయి.అందుకే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
also read:మన జాతీయ జెండా వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నెహ్రూ ఎర్రకోటపై జెండా ఎగరేశారు. ఆ తర్వాత ప్రతి ఏడాది అదే సంప్రదాయం కొనసాగింది. అంతే!అందుకే ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతుంటే.. మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఆ చారిత్రక రోజు గుర్తుకొస్తుంది.