Guess The Actress: ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటీనటులు ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. వాళ్లకు అవకాశాలు రాకపోవడం, లేదా ఆడవాళ్ళు అయితే పెళ్లిళ్లు కావడం వల్లనో ఇలా అనేక కారణాల వల్ల చాలామంది బెస్ట్ యాక్టర్స్ ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కూడా పెళ్లిళ్లు చేసుకుని నటన జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో చెల్లెలు పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులు మనసు దోచుకున్న ముద్దుగుమ్మ ఆ ఫొటోలోని అమ్మాయి.. రవి తేజ, ఉదయ్ కిరణ్, సిద్దార్థ్, తరుణ్ వంటి హీరోల సినిమాల్లో చెల్లెలు పాత్రలో నటించింది. ఆమె ఎవరో ఇప్పటికైన గుర్తుపట్టారా..? మౌనరాగం సీరియల్లో కూడా నటించింది.. ఆమె ఎవరు? ఇప్పుడేం చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని పాత్రలు చేసే యాక్టర్స్ కు ఆ పాత్రలు బాగా సెట్ అవుతాయి. అప్పటి హీరోలకు కొందరు చెల్లెలుగా నటించారు. అలాంటి వారిలో శిరీష ఒకరు. ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లలో నటించింది. మోడల్గా కెరీర్ మొదలు పెట్టి చెల్లెలి క్యారెక్టర్లకు కేరాఫ్గా నిలిచారు నటి శిరీష చతుర్వేదుల. మొదట మనసంతా నువ్వే’ సినిమాలోఉదయ్ కిరణ్ చెల్లెలుగా నటించింది.. అలా ఇండస్ట్రీలోని అందరితో నటించింది.. పెళ్లి తర్వాత సీరియల్స్ చేస్తూ వచ్చింది.. ఇప్పటికీ సీరియల్స్ చేస్తు తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్ల గొట్టేస్తుంది..
ఇండస్ట్రీలో నటీనటులుగా ఉన్న చాలామంది యాక్టర్స్.. పెళ్లి తర్వాత నటనకు కాస్త దూరమయ్యారు. ఈ నటి శిరీష కూడా పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలు, టీవీషోలకు దూరమైపోయారు శిరీష. అదే క్రమంలో టీచర్ గా కూడా పనిచేశారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధించారు. ఆ తర్వాత బెంగళూరులో సెటిల్ అయిపోయిన శిరీష కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచర్గా పని చేశారు. చాలా గ్యాప్ తర్వాత మౌనరాగం సీరియల్ లో కనిపించారీ అలాగే ‘సీతే రాముడి కట్నం’ ధారావాహికలోనూ యాక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటి కొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఒకప్పుడు ఏమన్నాటించిన సినిమాలు అన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇలాంటి నటి మళ్ళీ రాదు అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఇకపోతే ఇకపోతే ఒకవైపు సినిమాలు సీరియల్స్లలో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శిరీష తన లేటెస్ట్ ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది.. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈమె ప్రస్తుతం బెంగుళూరులోనే ఉంటుంది. ఒకవైపు కుటుంబాన్ని మరోవైపు సీరియల్స్ చేస్తూ వస్తుంది. స్టార్ మాలో ప్రసారం అయిన మౌనరాగం సీరియల్ తో రీ ఎంట్రీ ఇచ్చింది.
?igsh=MXBpZjBmcW94bnppaA==