Siddu Jonnalagadda : రీసెంట్ గా కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు ఎంత వరస్ట్ గా ఉంటున్నాయి అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ల మీద విపరీతమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. ప్రదీప్ రంగనాథన్ ను మీరు హీరో మెటీరియల్ లా అనిపించరు అని ఒక జర్నలిస్టు అడిగితే చాలామంది ఆమె ఫోటోలు తీసి మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
అలానే రియల్ లైఫ్ లో మీరు ఉమెనైజర అని సిద్దు జొన్నలగడ్డ అని కూడా అడిగారు. అయితే ఆ వీడియో కూడా అప్పట్లో బాగా పాపులర్ అయింది. సిద్దు కూడా దానికి ఆ ప్రెస్ మీట్ లో నార్మల్ గా సమాధానం ఇస్తూ ఆ తర్వాత జరిగిన దానిలో ఆడియో రూపంలో అసలైన క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ కామెంట్స్ పైన ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య చైతన్య జొన్నలగడ్డ రియాక్ట్ అయ్యారు. సిద్ధూను ఉమనైజర్ అన్నదానికి చైతు జొన్నలగడ్డ రియాక్షన్ ఏంటంటే.
ఒక జర్నలిస్టు మళ్ళీ సిద్దు జొన్నలగడ్డ ను ఉమెనైజర్ అని అడిగినప్పుడు మీరు దానిని మనసుకు తీసుకున్నారా ఒక తమ్ముడిని అలా అన్నందుకు బాధ ఉంటుంది కదా అని అడిగారు.
నేను దానిని మనసుకు తీసుకోలేదు ఎందుకు తీసుకుంటాం.? అతను ఉమెనైజర్ కాదు. ఒకవేళ ఉమెనైజర్ అయ్యి మాకు తెలియకపోతే ఓహో వీడు ఉమెనైజర్ అని మనసుకు తీసుకుంటాం, బాధపడతాం.
వాడు కాదు కాని దానికి కూడా క్లారిటీ ఇస్తూ ఇంత పెద్దగా రాశాడు. అదే నేనైతే అది కూడా వాడు రాయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను. ఆయనకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్లు మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు కాబట్టి అతను చెప్పాడు. నేను ఎందుకు రాసాడు అని తర్వాత అర్థం చేసుకున్నాను. నాకు కూడా వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు.
ఇకపోతే చైతన్య జొన్నలగడ్డ చాలా సినిమాల్లో నటుడుగా కనిపించాడు. రీసెంట్గా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా అతనికి వెంకన్న పాత్ర ద్వారా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పాత్రలో అతను నటించిన విధానం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆ పాత్రకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది దానిని పర్ఫెక్ట్ గా పట్టుకున్నాడు చైతు.
గతంలో చైతన్య బబుల్గం, హిట్ 3 వంటి సినిమాల్లో కూడా నటించాడు. కానీ ఆ సినిమాలతో ఊహించిన సాయి గుర్తింపు రాలేదు. వెంకన్న పాత్ర చూసిన తర్వాత చైతన్య జొన్నలగడ్డకు విపరీతంగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది.
Also Read: Manchu Manoj : రిలీజ్ అయ్యాక ఈవెనింగ్ షోలకే దిక్కు లేదు… నిజాన్ని గ్రహించారు