E-Paper
Advertisement

Yash Toxic: వివాదంలో టాక్సిక్ టీజర్.. సెన్సార్ బోర్డు స్పందన ఇదే!

Yash Toxic: వివాదంలో టాక్సిక్ టీజర్.. సెన్సార్ బోర్డు స్పందన ఇదే!
Advertisement

Yash Toxic: పాన్ ఇండియా స్టార్ హీరో యష్ (Yash)నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్(Toxic). కేజి ఎఫ్ 2 తరువాత ఎస్ నటిస్తున్న ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈయన పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది. అయితే కొంతమంది ఈ టీజర్ పై విమర్శలు కూడా కురిపించారు. ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్న నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు మహిళా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వెంటనే ఈ టీజర్ తొలగించాలి అంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదులు చేశారు.

టాక్సిక్ టీజర్ తో మాకు సంబంధం లేదు..

టాక్సిక్ సినిమా టీజర్ గురించి కర్ణాటక మహిళా కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లడంతో మహిళా కమిషన్ ఈ టీజర్ లో ఉన్న అభ్యంతర దృశ్యాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సెన్సార్ ఫిలిం బోర్డుకు లేఖ రాశారు. ఈ విషయంపై స్పందించిన సెన్సార్ బోర్డు వారి అభిప్రాయాలను తెలియచేశారు. మహిళా కమిషన్ రాసిన లేఖకు స్పందిస్తూ.. థియేటర్లో కాకుండా యూట్యూబ్ లో విడుదలైన టీజర్ మా పరిధిలోకి రావని తెలిపారు. కేవలం థియేటర్లలో విడుదలయ్యే టీజర్ లేదా ట్రైలర్ కు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ తప్పనిసరి అవసరమని, యూట్యూబ్లో విడుదల అయిన వాటికి, సెన్సార్ బోర్డు కు సంబంధంలేదని తెలియజేశారు.

సెన్సార్ బోర్డు నుంచి ఉపశమనం..

Advertisement

ఇక టాక్సిక్ చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి కంటెంట్ సర్టిఫికేషన్ కోసం తమ వద్దకు రాలేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఇలా సెన్సార్ బోర్డు ఈ వివాదం పై స్పందిస్తూ మాకు సంబంధం లేదనే విషయాన్ని తెలియచేయడంతో చిత్ర బృందానికి కాస్త ఉపశమనం లభించిందని చెప్పాలి. సెన్సార్ బోర్డ్ ఈ వివాదం పై స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వివాదంపై మహిళా కమిషన్, రాజకీయ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాల్సి ఉంది .

గీతు మోహన్ దాస్ పై విమర్శలు…

Advertisement

ఇక ఈ సినిమాకు మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈమె పట్ల కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి టీజర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడంతో తదుపరి ఈ సినిమా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతోంది అంటూ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాని మార్చి 19వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు . ఇక ఈ సినిమాలో కియార అద్వానీతో పాటు నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Maruthi -Chiranjeevi: మారుతి డైరెక్షన్ లో చిరు… మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×