BigTV English
Advertisement

IND vs PAK: టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు బిగ్ షాక్‌..చూసేవాడే క‌రువ‌య్యాడు.. ఒక్క టికెట్ కూడా సేల్ కాలేదు..!

IND vs PAK: టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు బిగ్ షాక్‌..చూసేవాడే క‌రువ‌య్యాడు.. ఒక్క టికెట్ కూడా సేల్ కాలేదు..!

IND vs PAK: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) నేపథ్యంలో… కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్  ( Team India vs Pakistan ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. మరో నాలుగు రోజుల్లో.. అంటే ఈ నెల 14వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాస్తవానికి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే కచ్చితంగా స్టేడియం హౌస్ ఫుల్ అవుతుంది. కానీ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 14వ తేదీన జరగనున్న మ్యాచ్ కు మాత్రం ఊహించని షాక్ తగిలింది.


Also Read: SA 20 2026 auction : బ్రెవిస్ కు ఏకంగా రూ.8కోట్లు.. మార్క్ర‌మ్ కు కావ్య పాప ద్రోహం.. ఆక్ష‌న్ లిస్ట్ ఇదే..!

టీమిండియా ( Team India ) వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో దుబాయ్ స్టేడియం టికెట్లు పూర్తిగా సేల్ కాలేదు. సగానికి సగం.. టికెట్ల విక్రయాలు పడిపోయాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ ఆదివార‌మే టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో ( Asia Cup 2025 tournament ) భాగంగా… టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఈ ఆదివారం జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌ర్ 14వ తేదీన జ‌రుగ‌నున్న ఈ మ్యాచ్ కు దుబాయ్ లోని అంత‌ర్జాతీయ వేదిక కానుంది. భార‌త కాల‌మాన ప్ర‌కారం… టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. సోనీ లీవ్‌, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో అన్ని భాష‌ల్లో ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ప్ర‌స‌రాలు వ‌స్తున్నాయి. సోనీ లీవ్ లో ఉచితంగా చూసే అవ‌కాశం క‌ల్పించారు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ ఎఫెక్ట్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలో… పాకిస్తాన్ జట్టుతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదని చాలామంది భారత క్రికెట్ నియంత్రణ మండలి పై ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీసీసీఐ. ఇలాంటి తరుణంలో ఈ మ్యాచ్ చూసేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు. అందుకే టికెట్లు కూడా కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది. అటు మ్యాచ్ ప్రసారమా జరిగినప్పుడు కూడా వ్యూయర్షిప్ తగ్గిపోయే… ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా…ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.

Also Read: Asia Cup 2025 : నేటి నుంచి ఆసియా కప్ షురూ… ఈ జట్ల మధ్య మొదటి మ్యాచ్.. టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

 

Related News

Rohit Sharma: అన్ని ఫార్మాట్స్ లో 5 సెంచరీలకు పైగా చేసిన ఏకైక క్రికెటర్ గా రోహిత్..ఇక ఆసీస్ కు రాబోమంటూ ప్ర‌క‌ట‌న‌

Womens World Cup 2025: ఆస్ట్రేలియా మ‌హిళ‌ల‌ జ‌ట్టుకు లైంగిక వేధింపులు..ఇండియాలో టోర్న‌మెంట్స్ పెట్టొద్దు అంటూ?

IND VS AUS: మూడో వ‌న్డేలో టీమిండియా విజ‌యం..గంభీర్ కు ఘోర అవ‌మానం..ర‌విశాస్త్రి కావాలంటూ !

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ…స‌చిన్ రికార్డు బ్రేక్, హిట్ మ్యాన్ ప్రైవేట్ పార్ట్ పై కొట్టిన కోహ్లీ

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ అర్థ‌సెంచ‌రీలు…60 హ‌ఫ్ సెంచ‌రీలు పూర్తి చేసిన‌ హిట్ మ్యాన్

Virat Kohli: హ‌మ్మ‌య్యా..డ‌కౌట్ కాలేదు, సింగిల్ తీసి కోహ్లీ సెల‌బ్రేష‌న్స్‌…స్మిత్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టిన‌ హెడ్

Harshit Rana: గిల్ మాట లెక్క‌చేయ‌ని హ‌ర్షిత్ రాణా..రోహిత్ టిప్స్ తీసుకుని 4 వికెట్లు

IND VS AUS, 3rd ODI: 4 వికెట్ల‌తో రెచ్చిపోయిన హ‌ర్షిత్ రాణా..ఆస్ట్రేలియా ఆలౌట్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

Big Stories

×