BigTV English
Advertisement

Chiranjeevi: ఫెడరేషన్ సభ్యులు నన్ను కలవలేదు.. తప్పుడు ప్రచారాలను ఆపండి.. ఫైర్ అయిన చిరు

Chiranjeevi: ఫెడరేషన్ సభ్యులు నన్ను కలవలేదు.. తప్పుడు ప్రచారాలను ఆపండి.. ఫైర్ అయిన చిరు

Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కార్మికులు (Cini Workers)30% వేతనాలు పెంచాలి అంటూ సమ్మె(Strike) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి సమస్య గురించి వివరించినట్లు వార్తలు వచ్చాయి అలాగే కొంతమంది ఫెడరేషన్ సభ్యులు కూడా మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో ఆయన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై చిరంజీవి స్పందించారు.


నన్ను ఎవరు కలవలేదు..

ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. “ఫిలిం ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకొని కొంతమంది వ్యక్తులు నేను వాళ్లని కలిశానని, వారు డిమాండ్ చేస్తున్న విధంగా 30% వేతనాల పెంపు డిమాండ్లను నెరువేరుస్తానని, అదేవిధంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చాను అంటూ తప్పుడు ప్రచారాలను చేయటం నా దృష్టికి వచ్చింది. నేను ఫెడరేషన్ సభ్యులను ఎవరిని కలవలేదు. ఈ సమస్య నా ఒక్కడిదే కాదు, మొత్తం పరిశ్రమ సమస్య. నాతో సహా ఏ వ్యక్తి అయినా ఈ సమస్యను పరిష్కరించాలి అంటే ఏకపక్ష నిర్ణయాలు హామీలు ఇవ్వలేరు.ఫిలిం ఛాంబర్ మాత్రమే సంబంధిత వ్యక్తులతో ఈ సమస్య గురించి చర్చలు జరిపి సరైన పరిష్కారం చూపిస్తారని, అప్పటి వరకు ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేయొద్దని ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరైనది కాదు అంటూ చిరంజీవి ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.


తప్పుడు వార్తలను ఖండించిన చిరు..

ఇలా మెగాస్టార్ చిరంజీవిని కలిసాము అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడంతో ఈ వార్తలకు చిరంజీవి అడ్డుకట్టు వేశారు. మరి చిరంజీవి చేసిన ఈ పోస్టుతో ఫెడరేషన్ సభ్యులు తమ నిరసనలను మరింత ఉదృతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇప్పటికే తమ డిమాండ్లను కచ్చితంగా నెరవేర్చాలని లేకపోతే తమ నిరసనలు ఆగవని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే చిరంజీవి తనని ఎవరూ కలవలేదని తాను ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వలేదని పోస్ట్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

మరి మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ పోస్ట్ పట్ల ఫెడరేషన్ సభ్యుల స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. తమకు 30% వేతనాలు పెంచే వరకు షూటింగ్స్ కు రామని కార్మికులు తేల్చి చెబుతున్నారు. అలాగే పక్క రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకన్నా షూటింగ్స్ జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు. మరి ఈ సమస్యకు ఫిలిం ఛాంబర్ ఎలాంటి పరిష్కారాన్ని చూపుతుంది? కార్మికులు అడిగిన విధంగానే 30% వేతనాలను పెంచుతారా? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు చిరంజీవితో పాటు బాలకృష్ణ వంటి స్టార్ హీరోలను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు.మరి ఇండస్ట్రీలో నెలకొన్న ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: Cine Workers Strike : ఆమరణ దీక్షకు రెడీ… సినీ కార్మికులను ఎవరూ ఆపలేరా ?

Related News

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్.

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!

Actor Vikranth: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ..700 మంది ఎంప్లాయిస్.. ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే!

Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి

Big Stories

×