Jana nayagan: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దళపతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు సినిమాలలో ఉంటూనే మరొకవైపు రాజకీయాలలోకి వెళ్లాలని ఆలోచించిన ఈయన అందులో భాగంగానే టీవీకే అనే పార్టీని స్థాపించి ఈ పార్టీ ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తన చివరి సినిమాగా జననాయగన్ సినిమా చేశారు. అయితే సెన్సార్ అభ్యంతరాల వల్ల ఈ ఏడాది జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉండగా మరొకవైపు సడన్గా ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా ఆన్లైన్లో లీక్ అవడంతో చిత్ర బృందం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తోంది. విడుదలకు ముందే ఇలాంటి లీక్ ఎదుర్కోవడంతో లీక్ చేసిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా మరొకవైపు ఈనెల 23వ తేదీన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నా యూనివర్సిటీలో ఎన్నికల నిఘా కోసం యువరాజ్ అనే వ్యక్తిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీసీటీవీ హెడ్ గా నియమించారు. అయితే కీలకమైన నిఘా విభాగంలో ఉన్న అతడు సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్ లో ఉన్న విజయ్ కొత్త సినిమా జననాయగన్ లీక్ అయిన వెర్షన్ ను చూశాడు. ఎన్నికల జరుగుతున్న సమయంలో విధుల్లో ఉండాల్సింది పోయి నిర్లక్ష్యంగా సినిమా చూడడం ఒక ఎత్తైతే.. ఆల్రెడీ సోషల్ మీడియాలో లీకైన జననాయగన్ సినిమాను చూసి పైరసీని ఎంకరేజ్ చేయడం మరో ఎత్తు. ఇకపోతే ఆ అధికారి సినిమా చూడడమే కాకుండా సినిమా చూస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు, వీడియోలు తీసి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
అంతేకాదు అంతకుముందే తాను అన్నా యూనివర్సిటీలో సీసీటీవీ హెడ్గా నియమితుడైనట్లు తన గుర్తింపు కార్డును కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక ఈ పోస్టులు కాస్త వైరల్ అవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చి ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్ళింది. ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడమే కాకుండా పైరసీని ప్రోత్సహించేలా వ్యవహరించినందుకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ప్రస్తుతం అతడిని అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:భర్త ఎఫైర్స్ పై నిజాలు బయటపెట్టిన సీనియర్ హీరోయిన్!
ఇకపోతే విజయ్ చివరి సినిమాగా తెరకెక్కిన జననాయగన్ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు.. మే 8వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చిత్ర బృందం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరొకవైపు ఈ సినిమా లీక్ నేపథ్యంలో సదరన్ ఇండియా ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ ఎడిటర్ ప్రదీప్ ఈ రాఘవ్ పై కొన్ని రోజుల పాటు సస్పెన్షన్ కూడా విధించింది. ఇక జననాయగన్ సినిమా విషయానికి వస్తే విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా మమితాబైజు కీలక పాత్రలో పోషించిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించారు