E-Paper
Advertisement

Varanasi: ఆ వీల్‌ చైర్ కేవలం వస్తువు కాదు.. అది ఒక ఆయుధం.. పృథ్వీరాజ్ పాత్రపై క్రేజీ అప్డేట్!

Varanasi: ఆ వీల్‌ చైర్ కేవలం వస్తువు కాదు.. అది ఒక ఆయుధం.. పృథ్వీరాజ్ పాత్రపై క్రేజీ అప్డేట్!
Advertisement

Varanasi:రాజమౌళి సినిమాలో హీరో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో, విలన్ అంతకంటే ఎక్కువ క్రూరంగా, తెలివైనవాడిగా ఉంటారు. జక్కన్న తన ప్రతినాయకులను చెక్కే విధానమే వేరు. ఇప్పుడు ‘వారణాసి’ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)ను ‘కుంభ’ అనే భీకరమైన పాత్రలో చూపిస్తున్నారు. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ, కేవలం తన మెదడుతో ప్రపంచాన్ని శాసించే ఈ పాత్ర గురించి పృథ్వీరాజ్ పంచుకున్న విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాలలోకి వెళితే ..

జక్కన్న మార్క్ విలనిజం:

రాజమౌళి సినిమాల్లో ‘భల్లాలదేవ’, ‘కాలకేయ’ వంటి విలన్ పాత్రలు ఎంతటి ఇంపాక్ట్ సృష్టించాయో మనకు తెలిసిందే. విలన్ బలంగా ఉంటేనే హీరో ఎలివేషన్ పీక్స్‌లో ఉంటుందని నమ్మే రాజమౌళి, ఈసారి పృథ్వీరాజ్ కోసం ‘కుంభ’ అనే అసాధారణమైన పాత్రను సృష్టించారు. గతంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’, ‘కురుప్’ వంటి చిత్రాలతో వైవిధ్యమైన నటనను కనబరిచిన పృథ్వీరాజ్, ఈ సినిమాలో శారీరక బలహీనత ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. అయితే, ఆయన కూర్చునే ‘వీల్‌చైర్’ కేవలం ఒక పరికరం మాత్రమే కాదని, అది ఆయన ఆలోచనలకు, వ్యక్తిత్వానికి ఒక కొనసాగింపు అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఆ కుర్చీ ఒక ఆయుధంలా పనిచేస్తుందని చెప్పడం విలనిజం ఏ స్థాయిలో ఉండబోతుందో హింట్ ఇస్తోంది.

శారీరక వైకల్యం.. కానీ శత్రువుల పాలిట మృత్యువు:

Advertisement

సాధారణంగా రాజమౌళి విలన్లంటే ఆరడుగుల ఆజానుభాహులు..కానీ ‘వారణాసి’లో కుంభ పాత్ర అందుకు భిన్నం. ఈ పాత్ర వీల్‌చైర్‌కే పరిమితమైనా, అతని మెదడు చాలా వేగంగా , ప్రమాదకరంగా ఆలోచిస్తుంది. షూటింగ్ సమయంలో తను కదలకుండా ఉండటానికి తన కాళ్లు, చేతులను ఆ వీల్‌చైర్‌కు బిగించి ఉంచేవారని, ఒక్కోసారి ఈగ వాలినా తోలుకోలేని పరిస్థితి ఉండేదని పృథ్వీరాజ్ సరదాగా పంచుకున్నారు. కానీ కెమెరా ముందుకు వస్తే మాత్రం ఆ వీల్‌చైర్ అతని మనసుతో నేరుగా అనుసంధానించబడి ఉంటుందని, అది అత్యంత భయానకమైన టెక్నాలజీతో కూడి ఉంటుందని లీక్ చేశారు. కదలలేకపోయినా ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోగల ‘మైండ్ గేమ్స్’ ఈ పాత్ర స్పెషాలిటీ.

ALSO READ:Varanasi: వారణాసిలో మరో ‘నాటు నాటు’ సాంగ్? షూటింగ్ పై మహేష్ బాబు క్లారిటీ?

రాజమౌళి ‘నైస్’ కోసం పృథ్వీరాజ్ తపన:

Advertisement

మలయాళంలో సూపర్ స్టార్ , దర్శకుడు కూడా అయిన పృథ్వీరాజ్, రాజమౌళి పనితీరుకు ముగ్ధుడయ్యారు. రాజమౌళి సెట్స్‌లో ఒక షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు వదలరని, 94 టేక్‌లు కూడా తీసుకుంటారని ఆయన వెల్లడించారు. సెట్‌లో రాజమౌళి నోటి వెంట ‘నైస్’ లేదా ‘వెరీ నైస్’ అనే మాట వినడానికి నటీనటులందరం పోటీ పడేవాళ్లమని చెప్పారు. మహేష్ బాబు వంటి గ్లోబల్ స్టార్‌ను ఎదుర్కోవడానికి పృథ్వీరాజ్ లాంటి ప్రతిభావంతుడైన నటుడిని విలన్‌గా ఎంచుకోవడం సినిమాకు పెద్ద అసెట్. వీరిద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమనిపిస్తోంది.

ఇండియన్ స్క్రీన్‌పై మరో ఐకానిక్ విలన్..

గంభీరమైన కంఠస్వరం, పదునైన చూపులతో పృథ్వీరాజ్ ‘కుంభ’ పాత్రలో ఎలా మెప్పించబోతున్నారో చూడాలి. రాజమౌళి విజన్, పృథ్వీరాజ్ నటన తోడైతే ఇండియన్ స్క్రీన్‌పై మరో ఐకానిక్ విలన్ పుట్టడం ఖాయం..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×