E-Paper
Advertisement

Hrithik Roshan: ఢిల్లీ హైకోర్టులో హృతిక్ రోషన్ కు భారీ ఊరట… వెంటనే ఆ పని చేయాలంటూ!

Hrithik Roshan: ఢిల్లీ హైకోర్టులో హృతిక్ రోషన్ కు భారీ ఊరట… వెంటనే ఆ పని చేయాలంటూ!
Advertisement

Hrithik Roshan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan)ఇటీవల ఢిల్లీ హైకోర్టును(Delhi Heigh Court) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంతోమంది అభివృద్ధి చెందిన టెక్నాలజీని వారి స్వలాభం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ఫోటోలు వీడియోలను ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున లాభం పొందుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇలా కోర్టును ఆశ్రయించిన వారిలో నటుడు హృతిక్ రోషన్ ఒకరు.

వెంటనే ఫోటోలు తొలగించాలి..

హృతిక్ రోషన్ అనుమతి లేకుండా కొన్ని బిజినెస్ వెబ్ సైట్లు అలాగే ఈ కామర్స్ వెబ్ సైట్లు హృతిక్ రోషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో వాటిని తొలగించాలని కోరుతూ ఈయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు.. ఇలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నేడు పిటిషన్ విచారణ జరిగింది . విచారణ అనంతరం కోర్టు కీలక ఉత్తర్వులను జారీచేసింది. ఎవరైతే హృతిక్ రోషన్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలు వీడియోలను ఉపయోగిస్తున్నారో వెంటనే డిలీట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది.

అభ్యంతరం వ్యక్తం చేసిన కోర్టు..

Advertisement

ఇకపోతే హృతిక్ రోషన్ తరపు న్యాయవాది పిటీషన్ లో భాగంగా అభిమానులు కూడా హృతిక్ రోషన్ ఫోటోలు వీడియోలు వాడుతున్నారని వాటిని కూడా అదుపు చేయాలని కోరారు. అయితే ఈ విషయంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అభిమానులు కేవలం వారిపై ఉన్న అభిమానంతో మాత్రమే ఫోటోలను ఉపయోగిస్తున్నారు తప్ప ఎలాంటి లాభాన్ని ఆశించి కాదని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఈ విషయంపై అక్కినేని నాగార్జున, ఐశ్వర్య అభిషేక్ దంపతులు, దీపికా పదుకొనే వంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంలో హృతిక్ రోషన్ కి కూడా ఊరట లభించింది. హృతిక్ రోషన్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఓటీటీలో దూసుకుపోతున్న వార్ 2..

Advertisement

ఇటీవల ఈయన యశ్ రాజ్ ఫిలిం యూనివర్స్ నుంచి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో నటించిన వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లో ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్(Net Flix) లో ప్రసారం అవుతూ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) కూడా నటించిన విషయం తెలిసిందే. ఇలా థియేటర్లో ఈ సినిమా కాస్త ప్రేక్షకులను నిరాశపరిచిన ఓటీటీలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని నెంబర్ వన్ స్థానంలో స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read: Ahana Krishan: ఖరీదైన కారు కొన్న నటి… ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×