Devara Premiere: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. థియేటర్లలోనే కాకుండా నెట్ఫ్లిక్స్ ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డు వ్యూస్ సాధించింది. అయితే, థియేట్రికల్ రన్ ముగిసి చాలా కాలం అవుతున్నా, ఈ సినిమా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు మాత్రం అందుబాటులోకి రాలేదు.
Read also-‘FWICE బహిష్కరణ తర్వాత మొదటిసారి కనిపించిన రణ్వీర్ సింగ్’.. అసలు ఏం జరిగిందంటే?
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైన కొన్ని నెలల్లోనే టీవీల్లో వచ్చేస్తుంటాయి. కానీ, ‘దేవర’ విషయంలో అలా జరగలేదు. దీనికి ప్రధాన కారణం ఓటీటీ ఒప్పందమేనని ఇండస్ట్రీ టాక్. నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు (సుమారు రూ. 155 కోట్లు) ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినప్పుడు, “నిర్దిష్ట కాలం వరకు తెలుగులో శాటిలైట్ ప్రసారాలు చేయకూడదు” అనే ప్రత్యేకమైన ‘ఎక్స్క్లూజివ్ విండో’ కండిషన్ పెట్టినట్లు సమాచారం. అందువల్లనే హిందీతో పాటు ఇతర భాషల వెర్షన్లు టీవీల్లో ప్రసారమైనప్పటికీ, తెలుగు వెర్షన్ మాత్రం హోల్డ్లో ఉండిపోయింది.
ప్రస్తుతం ఆ ఓటీటీ లాక్-ఇన్ పీరియడ్ ముగియడంతో, దేవర తెలుగు శాటిలైట్ రైట్స్ కోసం ప్రముఖ ఛానెల్స్ పోటీ పడ్డాయి. తాజా ఫిల్మ్నగర్ సమాచారం ప్రకారం, ప్రముఖ నెట్వర్క్ ఈటీవీ (ETV) భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. దాదాపు డీల్ చివరి దశకు వచ్చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Read also-Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..
సాధారణంగా ఈటీవీ నెట్వర్క్ ఇలాంటి కమర్షియల్ భారీ సినిమాలను కొనుగోలు చేయడం అరుదు. ఒకవేళ ఈ డీల్ గనుక లాక్ అయితే, బుల్లితెరపై ‘దేవర’ సరికొత్త టి.ఆర్.పి (TRP) రికార్డులను సృష్టించడం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం కొరటాల శివ ప్లాన్ చేస్తున్న ‘దేవర 2’ అప్డేట్స్ కోసం, అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న తదుపరి పాన్-ఇండియా చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.