Harassment Case: ‘ధురంధర్’ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసిన సైనీ ఎస్. జోహ్రాయ్ (Saini S Johray) పై చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాజెక్ట్లో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక మహిళ ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు ఆధారంగా చండీగఢ్లోని సెక్టార్-17 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, జోహ్రాయ్ ఈ కేసులో ఆ తర్వాత బెయిల్ పొందినట్లు సమాచారం.
Read also-హీరో రానా గురించి బయటపడ్డ భయంకర నిజం.. ఇది అస్సలు ఊహించిఉండరు..
బాధితురాలి కథనం ప్రకారం, సెప్టెంబర్ 2025లో ఆమెను ఈ సినిమా బృందంలో నియమించుకున్నారు. జోహ్రాయ్ తనను మెంటార్గా పరిచయం చేసుకున్నాడని, పని విషయమై మాట్లాడాలని చండీగఢ్లోని ‘తాజ్’ హోటల్ గదికి పిలిపించాడని ఆమె తెలిపింది. మిగిలిన టీమ్ మెంబర్స్ కూడా ఉంటారని తాను అనుకున్నానని, కానీ అక్కడికి వెళ్లాక కేవలం తనను మాత్రమే ఒంటరిగా పిలిచాడనే విషయం అర్థమైందని చెప్పింది.
సెప్టెంబర్ 10న రాత్రి ఆమె హోటల్కు వెళ్లినప్పుడు, జోహ్రాయ్ ఆమెను మద్యం సేవించవలసిందిగా ఒత్తిడి చేశాడని, నిరాకరించినప్పటికీ బలవంతంగా తాగించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ డ్రింక్ తాగిన కొద్దిసేపటికే తనకు తీవ్రమైన తలతిరగడం ప్రారంభమైందని, గది నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పటికీ తనను అడ్డుకున్నాడని ఆమె ఆరోపించింది. డాన్స్ నేర్పిస్తాననే సాకుతో జోహ్రాయ్ అసభ్యకరంగా తాకుతూ, లైంగిక వేధింపులకు మరియు దాడికి పాల్పడ్డాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Read also-‘ఇరుముడి’ మాస్ మహారాజాకి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందా?.. రిలీజ్ ప్లాన్ ఎప్పుడంటే?
రాత్రంతా గదిలోనే బంధించి, బాత్రూమ్లోకి వెళ్లి నప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తించాడని, భయాందోళనల మధ్య రాత్రంతా గడిపి, మరుసటి రోజు ఉదయం అక్కడి నుండి బయటపడ్డానని బాధితురాలు వివరించింది. ఈ మీటింగ్ గురించి ఎవరికైనా చెబితే కెరీర్ నాశనం అవుతుందని జోహ్రాయ్ హెచ్చరించినట్లు ఆమె పేర్కొంది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత జోహ్రాయ్ తనపైనే తిరిగి తప్పుడు ఫిర్యాదులు చేశాడని బాధితురాలు ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.