Lookout Notice to Shilpa Shetty Couple: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులు మరోసారి షాక్ తగిలింది. ఈ స్టార్ కపుల్పై ఇటీవల చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో వారిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఓ కంపెనీ విస్తరణ కోసం తన దగ్గర రూ. 60 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ ఇటీవల వారిపై లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి పోలీసులకు ఫిర్యాదు చేయగా… వారిపై భారతీయ శిక్షాస్మృతి కింది చీటింగ్ కేసు నమోదైంది. ఇప్పుడి ఈ కేసలో ఆర్థిక నేరాలా విభాగానికి (EOW) చెందిన అధికారులు శిల్పా శెట్టి దంపతులకు లుక్కౌట్ నోటీసులు ఇచ్చారు.
పోలీసుల సమాచారం ప్రస్తుతం అధికారులు శిల్పాశెట్టి దంపతుల ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూతబడిన కంపెనీ ఆడిటర్ను కూడా పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు వారు దేశం విడిచిపోకుండా ఉండేందుకు పోలీసులు వారికి లుకౌట్ సర్క్యూలర్ జారీ చేశారని తెలుస్తోంది. కాగా 2015 నుంచి 2023 మధ్య కాలంలో షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ డీల్ టీవీ కంపెనీకి శిల్పాశెట్టి దంపతులు డైరెక్టర్స్గా ఉన్నారు. అదే సమయంలో తాను రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా శిల్పాశెట్టి దంపతులను కలిసిశానని పేర్కొన్నారు.
అయితే తమ వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టాలని దీపక్ కొఠారి వద్ద రూ. 60 కోట్లు తీసుకున్నారని, అయితే వాటిని తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుని దీపక్ కొఠారి ఈ ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 87.6 శాతం వాటా వారిదేనని చెప్పారు. మొదట వీరు 12 శాతం వడ్డీతో రూ. 75 కోట్లు అబ్బు కావాలని అడిగారు. కానీ, ఆ మొత్తం పన్నుల భారం లేకుండ పెట్టుబడిగా మారుస్తే మంచిదని ఒప్పించారని ఆయన వివరించారు. ఈ క్రమంలో కొఠారీ 2015లో రెండు విడతల్లో రూ. 31.9 కోట్లు, రూ. 28.53 కోట్లు బదిలి చేశారు పేర్కొన్నారు.
2016లో శిల్పాశెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా. అదే ఏడాది ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2017లో మరో ఒప్పందం విఫలమవడంతో కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తెలిసిందని దీపక్ కొఠారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి, మోసం, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో ఈ కేసును జూహు పోలీసు స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. దీంతో ఈ కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా శెట్టి దంపతులపై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తాజాగా లుక్కౌట్ నోటీసులు ఇచ్చారు.
Also Read: Samantha: రాజ్ నిడిమోరుతో సమంత దుబాయ్ వీడియో.. డైరెక్టర్ భార్య కౌంటర్!