Devi Sri- Thaman: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఒక ఈవెంట్లో దర్శకుడు హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేకపోయారో ఆయన క్లారిటీ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పని చేస్తుండటం, దానికి తోడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తోడవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపయ్యాయి. తాజాగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన దేవి శ్రీ ప్రసాద్ కనిపించకపోవడంతో అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమాకు బీజీఎం అందించి థమన్ కూడా ఈవెంట్ కు హాజరు అవ్వలేదు. దీనిపై హరీష్ శంకర్ వేదికపైనే స్పందిస్తూ అసలు కారణాన్ని వివరించారు.
Read also-TV Heroines : ఈ కన్నడ సీరియల్ నటి చాలా చాలా రిచ్.. ఎంత సంపాదించిందో తెలిస్తే ఏమైపోతారో!
హరీష్ శంకర్ మాట్లాడుతూ, దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం తన మ్యూజికల్ టూర్ల (Musical Tours) లో భాగంగా విదేశాల్లో ఉన్నారని తెలిపారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఆయన అమెరికా మరియు ఇతర దేశాల్లో లైవ్ కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నారని, ఆ షెడ్యూల్స్ కారణంగానే ఈ కార్యక్రమానికి రాలేకపోయారని స్పష్టం చేశారు. డిఎస్పి భౌతికంగా ఇక్కడ లేకపోయినా, తన సంగీతంతో ఎప్పుడూ సినిమాతోనే ఉంటారని హరీష్ పేర్కొన్నారు. ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించారని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎనర్జీకి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డిజైన్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. “దేవి ఎప్పుడూ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక ప్రత్యేకమైన ఉత్సాహంతో పని చేస్తాడు. ఈ సినిమా పాటలు అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటాయి” అని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా బీజీఎం అందించిన థమన్ కూడా ఈ వెంటుకు హాజరు కాలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు జరుగాయిని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
Readalso-Jana Nayagan: మరోసారి విడుదలకు సిద్ధమవుతున్న విజయ్ ‘జన నాయగన్’.. రిలీజ్ ఎప్పుడంటే?
దేవి శ్రీ ప్రసాద్ గైర్హాజరు గురించి వివరించడమే కాకుండా, సినిమా షూటింగ్ విశేషాలను కూడా హరీష్ పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ షెడ్యూల్స్తో బిజీగా ఉన్నప్పటికీ, సినిమా కోసం కేటాయించిన సమయంలో అత్యంత ప్రతిభను కనబరుస్తున్నారని ప్రశంసించారు. మొత్తానికి డిఎస్పి, థమన్ ఈ ఈవెంట్ కు రాకపోవడం వెనుక ఎలాంటి విభేదాలు లేవని, కేవలం వృత్తిపరమైన పనుల వల్ల మాత్రమే ఆయన దూరంగా ఉన్నారని హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ – డిఎస్పి ల ‘మ్యాజికల్ ట్రయో’ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.