E-Paper
Advertisement

Tollywood: సినీ ప్రేమికులకు శుభవార్త.. థియేటర్లలో ఫ్రీ పార్కింగ్.. హైకోర్టు ఉత్తర్వులు!

Tollywood: సినీ ప్రేమికులకు శుభవార్త.. థియేటర్లలో ఫ్రీ పార్కింగ్.. హైకోర్టు ఉత్తర్వులు!
Advertisement

Tollywood: సినిమా టికెట్ రేట్లు పెరిగాయని బాధపడుతున్న ప్రేక్షకులకు తెలంగాణ హైకోర్టు అదిరిపోయే ఊరటనిచ్చింది. థియేటర్లకు వెళ్లే ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ‘పార్కింగ్ ఫీజు’ వ్యవహారంపై న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ఇకపై పార్కింగ్ వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సామాన్య ప్రేక్షకులపై పడుతున్న ఈ అదనపు భారాన్ని తొలగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం..

పార్కింగ్ దందాకు చెక్.. హైకోర్టు సంచలన తీర్పు:

చాలా కాలంగా మల్టీప్లెక్స్‌లలో టికెట్ చూపిస్తే పార్కింగ్ ఫ్రీగా ఇస్తున్నారు కానీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం జనం నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై ఎప్పటి నుంచో అసంతృప్తి ఉంది. అయితే, 2021లో ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 121 వల్ల సింగిల్ థియేటర్లకు ఈ ఫీజు వసూలు చేసే మినహాయింపు ఉండేది. ఇక తాజాగా ఈ జీవోను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. అంటే ఇకపై మల్టీప్లెక్స్‌లతో సమానంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా టికెట్ ఉన్న ప్రేక్షకుడి నుంచి ఒక్క రూపాయి కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేసే హక్కు యాజమాన్యాలకు ఉండదు.

ఒక వ్యక్తి పోరాటం.. సామాన్యుడికి గెలుపు:

Advertisement

ఈ మార్పు రావడానికి కారణం ప్రేమ్ రమావత్ అనే ఒక సామాన్య ప్రేక్షకుడు చేసిన పోరాటం. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ థియేటర్‌కు వెళ్లిన ఆయన నుంచి పార్కింగ్ కోసం రూ.20 వసూలు చేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. సింగిల్ స్క్రీన్లకు మాత్రమే ఈ మినహాయింపు ఇవ్వడం ఏంటని ఆయన వేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన కోర్టు, ప్రభుత్వం ఇచ్చిన ఆ పాత వెసులుబాటును ప్రశ్నించింది. ఇక సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోందని భావించి, అందరికీ సమానమైన నిబంధనలు వర్తించాలని తీర్పునిచ్చింది. ఒక్క వ్యక్తి చొరవ వల్ల ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రేక్షకులకు మేలు జరగబోతోంది.

అమలు జరుగుతుందా? ప్రేక్షకులు ఏం చేయాలి?:

ఇక కోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చింది కానీ, గ్రౌండ్ లెవల్‌లో థియేటర్ల యాజమాన్యాలు వీటిని ఎంతవరకు పాటిస్తాయన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. గతంలో కూడా కొన్ని జీవోలు వచ్చినా అవి పేపర్లకే పరిమితమయ్యాయి. అయితే ఈసారి హైకోర్టు నేరుగా స్పష్టం చేయడంతో, టికెట్ ఉన్న ప్రతి ప్రేక్షకుడికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించడం థియేటర్ల బాధ్యత. ఇక ఒకవేళ ఎవరైనా టికెట్ ఉన్నా డబ్బులు అడిగితే, కోర్టు ఆదేశాల గురించి నిలదీసే అవకాశం ప్రేక్షకులకు ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండటంతో, ఇకనైనా థియేటర్ల వద్ద పార్కింగ్ గొడవలు తగ్గుతాయని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.

Advertisement

 

also read: Tollywood: పిక్ ఆఫ్ ది డే.. ఒకే ఫ్రేమ్ లో చిరు – పవన్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×