Kollywood:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ తన సహ నటిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. దశాబ్ద కాలానికి పైగా వైవాహిక బంధంలో ఎంతో సంతోషంగా గడిపారు. పిల్లలు కూడా జన్మించారు. అయితే సడన్గా ఆయన మరొకరితో తిరగడం చూసి ఆమె జీర్ణించుకోలేకపోయింది. అన్నీ తానై సర్వస్వం అనుకున్న భర్త తనకు దూరమవుతున్నాడు అని తెలిసి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ సదరు హీరో మాత్రం కట్టుకున్న భార్య నుంచి విడాకులు తీసుకుంటూ.. కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఏడాది కాలంగా ఈ కేసు కోర్టులో నడుస్తుండగా.. ఇప్పుడు ఈ విడాకుల వ్యవహారం మరో మలుపు తీసుకుంది. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఈ మాజీ జంట వ్యవహారంలోకి ఇప్పుడు గోవా ల్యాండ్ గొడవతో పాటుగా దళపతి విజయ్ పేరు కూడా ఇందులో చేరడంతో సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి.
వారు ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో జయం రవి.. ఆయన భార్య ఆర్తి. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల వ్యవహారం కోర్టులో సాగుతున్న నేపథ్యంలో జయం రవి తన సన్నిహితురాలు సింగర్ కేనీషా ఫ్రాన్సిస్ తో కలిసి గోవాలో సుమారుగా 42 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలలో జయం రవి తనను తాను వైవాహిక స్థితి దగ్గర అన్ మ్యారీడ్ అని పేర్కొనడంతో ఈ విషయం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఆర్తితో ఇంకా చట్టబద్ధంగా విడాకులు రాకముందే.. కోర్టులో కేసు నడుస్తుండగానే రవి ఇలా ఎలా పేర్కొంటారని అటు నెట్టిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు.
ALSO READ:Sharwanand: బైకర్ కోసం శర్వానంద్ అన్ని కేజీల బరువు తగ్గారా? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!
ఇకపోతే ఇదిలా ఉండగా మరొకవైపు చెన్నైలో ఒక రిసెప్షన్ వేడుకలో విజయ్ దళపతి – త్రిష ఒకే రంగు దుస్తుల్లో మెరవడం కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు ఇదే తరహాలో గతంలో జయం రవి కెనీషా కూడా ఒకే చోట రంగు దుస్తుల్లో కనిపించిన వీడియోలను నెటిజన్లు ఇప్పుడు బయటకు తీస్తున్నారు విజయ్ – త్రిష గురించి ఇంతగా మాట్లాడుతున్న జనం గత ఏడాది జయం రవి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని అటు ఆర్తి కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్తి ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా ఒక స్త్రీ గౌరవం అనేది ఆమె భర్త ఇచ్చే విలువపై ఆధారపడి ఉండకూడదని.. పోయిన ఏడాది ఇలాంటి సమస్య జరిగినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు ఇంతలా చర్చిస్తున్నారు.. సెలబ్రిటీ మార్కెట్ ను బట్టి జాలి కూడా మారుతుందా? అంటూ ప్రశ్నించింది.. ఇక ప్రస్తుతం సింగర్ కోసం జయం రవి తీసుకున్న ఆ ల్యాండ్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.