NTR Controversy: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ వంటి భారీ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉన్నారు. అయితే, సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక లేటెస్ట్ ఫోటో ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ ఫోటో ఎన్టీఆర్ సొంత మేకోవర్ కాదని, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఫోటోను ఏఐ (AI) సాయంతో మార్పింగ్ చేశారనే విషయం బయటపడటంతో నెటిజన్లు, ముఖ్యంగా సినీ విమర్శకులు పీఆర్ (PR) టీమ్ తీరుపై మండిపడుతున్నారు.
Read also-Podarillu Today Episode : చక్రీ, ఆదిల మధ్య పోటీ.. గెలిచిన మహా.. ఎపిసోడ్ కు హైలెట్ ట్విస్ట్.. .
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్గా, గడ్డంతో ఉన్న ఒక ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ కొత్త లుక్ ఇదేనంటూ అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ, తీరా చూస్తే అది మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ గతంలో దిగిన ఒక ఫోటో అని తేలింది. ఉన్ని ముకుందన్ ముఖం ఉన్న చోట ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎన్టీఆర్ ముఖాన్ని అతికించారు. ఈ మార్పింగ్ ఫోటోను కొందరు కావాలనే “లీక్డ్ లుక్” అంటూ ప్రచారం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక స్టార్ హీరో ఇమేజ్ను పెంచడానికి ఇలాంటి తప్పుడు పద్ధతులు పాటించాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టాలీవుడ్లో పీఆర్ వ్యవస్థ పనితీరుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు పీఆర్ అంటే సినిమా అప్డేట్స్ ఇవ్వడం, హీరోల ఇమేజ్ను కాపాడటం. కానీ ఇప్పుడు ఫేక్ ఏఐ పోస్టర్లతో సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడం. ఇతర భాషా నటుల ఫోటోలను, స్టైల్స్ను దొంగిలించి తెలుగు హీరోలకు ఆపాదించడం. లేని క్రేజ్ను ఉన్నట్లు చూపించే క్రమంలో పీఆర్ టీమ్స్ హద్దులు దాటుతున్నాయి. ఎన్టీఆర్ వంటి స్వయంకృషితో ఎదిగిన నటుడికి, తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజం స్టైల్ ఉంది. ఆయనకు ఇలాంటి “కాపీ” లుక్స్ అవసరం లేదు. కానీ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోసం పీఆర్ టీమ్స్ చేస్తున్న ఇలాంటి పనులు హీరోల అసలు క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నాయి.
కేవలం ఎన్టీఆర్ విషయంలోనే కాదు, టాలీవుడ్లోని చాలామంది అగ్ర హీరోల విషయంలో ఇలాంటి ఏఐ మార్పింగ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటివి బయటపడినప్పుడు ఇతర భాషల వారు టాలీవుడ్ పీఆర్ స్ట్రాటజీలను చూసి నవ్వుకునే పరిస్థితి వస్తోంది. టెక్నాలజీని వాడటం తప్పు కాదు, కానీ దాన్ని వాడుకుని మరొకరి ఫోటోలను దొంగిలించి సొంత హీరోకి అంటగట్టడం కచ్చితంగా దిగజారుడుతనమే. ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ స్టార్కు ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ అసలు అవసరం లేదు. ఇప్పటికైనా పీఆర్ టీమ్స్ వాస్తవానికి దగ్గరగా ఉంటూ, సహజమైన ప్రచార పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.