E-Paper
Advertisement

Lady Director: 8 సినిమాలకే రిటైర్మెంట్.. ఈ లేడీ డైరెక్టర్‌కి ఏం అయింది?

Lady Director: 8 సినిమాలకే రిటైర్మెంట్.. ఈ లేడీ డైరెక్టర్‌కి ఏం అయింది?

Lady Director: సినిమా ఇండస్ట్రీలో మేల్ డైరెక్టర్స్ తో పోల్చుకుంటే లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే వీరంతా కూడా తమ అద్భుతమైన ప్రతిభతో, టేకింగ్ విజన్ తో మంచి విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే.అయితే ఉన్నదే తక్కువ మంది లేడీ డైరెక్టర్లు. పైగా మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. కానీ అప్పుడే రిటైర్మెంట్ అంటూ చేస్తున్న కామెంట్లు అభిమానులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే చేసింది 8 సినిమాలే కానీ ఆ లేడీ డైరెక్టర్ రిటైర్మెంట్ తీసుకుంటాను అని చెప్పి అందుకు తగ్గ కారణాన్ని కూడా వివరించింది. దీంతో అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె ఎవరు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెబుతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

రిటైర్ కావాలనుకుంటున్న లేడీ డైరెక్టర్..

ఆమె ఎవరో కాదు ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధా కొంగర. తాజాగా శివ కార్తికేయన్ హీరోగా, శ్రీ లీలా హీరోయిన్గా పొలిటికల్ పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో పరాశక్తి అనే చిత్రానికి దర్శకత్వం వహించింది. 2026 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది సుధా కొంగర. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె తన డ్రీమ్ గురించి చెబుతూ రిటైర్మెంట్ గురించి కూడా తెలిపింది.

సుధా కొంగర మాట్లాడుతూ.. “నాకు లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. అందుకే పూర్తిస్థాయి ప్రేమ కథను తెరకెక్కించాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాను. అది రజినీకాంత్ సార్ చేస్తే మరింత బాగుంటుంది. ఇప్పటికే నా వద్ద మంచి కథ ఉంది. దానిని నేను డెవలప్ చేయాలి. నిజానికి నేను అలసిపోయాను. అందుకే త్వరగానే రిటైర్ కావాలనుకుంటున్నాను “అంటూ తెలిపింది సుధా కొంగర. మొత్తానికైతే అలసిపోయానని అందుకే రిటైర్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

చేసింది 8 సినిమాలే..

ఇకపోతే సుధా కొంగర విషయానికి వస్తే.. ఈమె తన కెరీర్లో ఇప్పటివరకు చేసింది కేవలం ఎనిమిది సినిమాలే కావడం గమనార్హం. సుధా కొంగర ప్రసాద్ అయిన ఈమె వృత్తిరీత్యా సుధా కొంగర గా పిలువబడుతోంది. దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్ గా కెరియర్ ను ఆరంభించిన ఈమె ఎక్కువగా తమిళ్ చిత్రాలకు పనిచేస్తోంది .

తొలిసారి ద్రోహి అనే తమిళ చిత్రం ద్వారా దర్శకురాలిగా అరంగేట్రం చేసిన సుధా 2016లో వచ్చిన ద్విభాషా చిత్రం ఇరుధి సుత్రు అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకుంది. ఆ తర్వాత 2017 లో ఇదే చిత్రాన్ని తెలుగులో గురు అంటూ రీమేక్ చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకూ 8 చిత్రాలు చేసిన ఈమె తమిళ చిత్రాలలో ఎక్కువగా పనిచేసినా తెలుగమ్మాయి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించింది.

ALSO READ:Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై కేస్ ఫైల్.. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ!

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×