E-Paper
Advertisement

Maheshbabu: స్పీడ్ పెంచిన మహేష్ బాబు.. ఆ నగరాలపై ప్రత్యేక దృష్టి!

Maheshbabu: స్పీడ్ పెంచిన మహేష్ బాబు.. ఆ నగరాలపై ప్రత్యేక దృష్టి!
Advertisement

Maheshbabu: సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) వాలకం చూస్తుంటే.. ఇప్పుడు సినిమాలకంటే కూడా తన వ్యాపారాన్ని విస్తరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆయన దృష్టి పక్క నగరాలతో పాటూ రాష్ట్రాలపై పడడం అభిమానులలో మరింత అంచనాలను పెంచేసింది. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ.. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకుంటున్నారు మహేష్ బాబు. ఈ క్రమంలోనే ఆయన ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు మల్టీప్లెక్స్ థియేటర్ రంగంలో దూసుకుపోతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

వ్యాపార విస్తరణకై మహేష్ బాబు దృష్టి..

విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులో “ఏషియన్ సినిమాస్” తో కలిసి సంయుక్తంగా “ఏఎంబి సినిమాస్” ను నిర్మించిన మహేష్ బాబు.. ఇప్పుడు ఈ బ్రాండ్ ను దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే హైదరాబాదులో మొదలైన ఈ ఏఎంబి సినిమాస్ కాస్త రీసెంట్గా బెంగళూరులో ఏకంగా 9.స్క్రీన్ లతో అత్యధిక సదుపాయాలతో ఒక అద్భుతమైన మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఆయన దృష్టి మిగతా నగరాలపై పడిందని సమాచారం. అందులో భాగంగానే ప్రస్తుతం విశాఖలో కూడా తన వ్యాపారాన్ని విస్తరింప చేయాలని మహేష్ బాబు చూస్తున్నారు.

విశాఖపట్నం తో పాటు పక్క రాష్ట్రాలలో కూడా..

Advertisement

ఇకపోతే విశాఖలో మాత్రమే కాకుండా బెంగళూరు ఎయిర్ పోర్టు సమీపంలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మాణానికి మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడితో ఆగిపోకుండా కేరళ , తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలలో కూడా ఏఎంబి మల్టీప్లెక్స్ ను ఆయన ప్రారంభించాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే మొదట ఒక భారీ మల్టీప్లెక్స్ ను విశాఖపట్నంలో నిర్మించాలని ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అతిపెద్ద షాపింగ్ మాల్ తో పాటు మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభించారు. అక్కడ నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇక అల్లు అర్జున్ బాటలోనే మహేష్ బాబు కూడా తన మల్టీప్లెక్స్ ను అక్కడ నిర్మించాలని చూస్తున్నారు. ఏది ఏమైనా మహేష్ బాబు ఇప్పుడు ఒక వైపు సినిమాలు.. మరొకవైపు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ మరింత బిజీగా మారిపోయారని చెప్పాలి.

ALSO READ:Trisha – Vijay: జ్ఞానోదయం అయింది.. విజయ్ – త్రిష రిలేషన్ పై డైరెక్టర్ ఊహించని కామెంట్!

వారణాసితో పాన్ వరల్డ్ రికార్డ్..

Advertisement

ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు , రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమాలో నటిస్తున్నారు. గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఆఫ్రికన్ అడవుల్లో సాగే ఈ కథ టైం ట్రావెల్ తో పాటు మైథలాజికల్ టచ్ కూడా ఇవ్వనున్నారు. ఇక భారీ అంచనాల మధ్య 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కుంభ అనే విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి వదులుతున్న చిన్న చిన్న అప్డేట్స్, చేపట్టిన ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై మరింత అంచనాలు పెంచేసాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ గుర్తింపును సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మహేష్ బాబు.

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×