E-Paper
Advertisement

Mani Ratnam: పెద్ద తెరపైనే చూడాలి.. సర్వైవల్ థ్రిల్లర్‌ చిత్రం చూసి దిగ్గజ దర్శకుడు ఫిదా!

Mani Ratnam: పెద్ద తెరపైనే చూడాలి.. సర్వైవల్ థ్రిల్లర్‌ చిత్రం చూసి దిగ్గజ దర్శకుడు ఫిదా!
Advertisement

Mani Ratnam: ఈ రోజు సినిమా హిట్ అవడం గగనమవుతోంది. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలే ప్రేక్షకులను అలరిస్తాయి. కొన్ని సినిమాలు హిట్ కాకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి చిత్రాలుగా గుర్తింపు పొందుతాయి. అలా ఇప్పుడో చిత్రం దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) ప్రశంసలు అందుకుని వార్తలలో నిలుస్తోంది. ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ‘తు యా మైన్’ (Tu Yaa Main). ఇటీవల విడుదలై ఈ చిత్రం ప్రేక్షకుల నుండి, అలాగే విమర్శకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో చిత్ర టీమ్ అంతా సంతోషించేలా.. ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రశంలు కురిపించారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Actress Trisha: నటి త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ లీడర్..ఆ ఉద్దేశం లేదంటూ!

దిగ్గజ దర్శకుడి ప్రశంసలు

Advertisement

తాజాగా దక్షిణాదిలో నిర్వహించిన ఓ ప్రత్యేక స్క్రీనింగ్‌లో భారతీయ చలనచిత్ర దిగ్గజం మణిరత్నం ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం చిత్రబృందాన్ని ఆయన ఎంతగానో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బిజోయ్ నంబియార్ (Bejoy Nambiar) ఈ చిత్రంతో ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకువచ్చారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్లలో, ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఒక ప్రత్యేక అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం. సినిమా అంతా చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. చిత్రయూనిట్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడండి. మంచి అనుభూతిని పొందుతారు’’ అని మణిరత్నం ప్రశంసలు కురిపించారు. దీంతో చిత్రయూనిట్‌ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.

Also Read- Shrasti Verma: ‘న్యాయం చేయరా దేవుడా..’ అంటోన్న శ్రష్టి వర్మ.. మ్యాటరేంటో తెలుసా?

ఎమోషన్స్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అంశాలతో

Advertisement

ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన అనంతరం, మణిరత్నంతో పాటు సినిమా చూసిన వారంతా సినిమాపై పాజిటివ్‌గా స్పందించినట్లుగా మేకర్స్ తెలిపారు. కొందరు దీనిని ‘అద్భుతమైన సినిమా’గా అభివర్ణిస్తే, మరికొందరు ఇందులోని ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ సరికొత్త అనుభూతిని ఇచ్చాయని అంటున్నారు. మణిరత్నం వంటి లెజెండరీ డైరెక్టర్ నుంచి ప్రశంసలు లభించడంతో చాలా హ్యాపీగా ఉందని, ఆయన మాటలు సినిమా విజయానికి మరింత బలాన్నిచ్చాయని మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ, వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి నిర్మాతలు. యువతను లక్ష్యంగా చేసుకుని, ఇంతకు ముందెన్నడూ చూడని ఎమోషన్స్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాను రూపొందించామని నిర్మాతలు తెలిపారు.

Also Read- Band Melam OTT: హర్ష రోషన్ బ్యాండ్ మేళం ఓటీటీ డీల్ క్లోజ్.. డిజిటల్ రైట్స్ ఆ ఓటీటీ సొంత!

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×