Mazaka Producer Returns Losses: మొన్నటి వరకు హిట్స్, బ్లాక్ బస్టర్స్తో టాలీవుడ్ పరిశ్రమ వెలుగువెలిగింది. కానీ, ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక.. భారీ బడ్జెట్ పెడితేనే హిట్ అన్నట్టుగా చూస్తున్నాయి సినీ వర్గాలు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా.. భారీ మొత్తంలో బడ్జెట్ పెట్టి నిర్మాతలు చేతులు కాల్చుకుంటున్నారు. వారిని నమ్ముకున్న బయ్యర్లు కూడా నష్టాలు చూస్తున్నారు. వరుసగా చిత్రాలు ప్లాప్ అవుతుండటంతో ఇప్పటికీ రియలైజ్ అవుతున్నారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ప్రస్తుతం బడా నిర్మాతలు సైతం అప్పుల్లో కూరుకుపోయారు. మిడియం రేంజ్ సినిమా తీసే పరిస్థితుల్లో కూడా లేరట. వారిని నమ్మి సినిమా కొన్న బయ్యర్ల పరిస్థితి కూడా అంతే. దీంతో బయ్యర్లు తమ స్టైల్ మార్చారు. నిర్మాత దగ్గర సినిమా కొనాలంటే.. నష్టాలను తిరిగి ఇస్తేనే.. కొత్త సినిమా కొంటున్నామంటున్నారు. దీంతో చేసేది లేక.. బయ్యర్లకు నష్టాలను వెనక్కి ఇస్తున్నారు. తాజాగా మజాకా మూవీ నిర్మాత కూడా బయ్యర్లకు డబ్బు వెనక్కి ఇచ్చేశాడట. సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ మజాకా. హాస్య మూవీస్ బ్యానర్లో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
Also Read: Varun Teja-Lavanya Son: వరుణ్ తేజ్-లావణ్య కొడుకుని చూశారా.. మనవడిని ఎత్తుకుని మురిసిపోతున్న చిరు!
ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్లతో మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని మూవీ టీం గట్టిగా నమ్మింది. వారి కాన్ఫిడెన్స్ చూసి బయ్యర్లు కూడా నిర్మాత కోట్ చేసిన ధరకే మజాకాని కొన్నారు. విడుదల తర్వాత మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. అయితే, విడుదలకు ముందే మజాకా నిర్మాతకు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయి. నాన్ థియేట్రికల్ రైట్స్, ఓటీటీ ద్వారా వచ్చిన డబ్బులతో నిర్మాత గట్టెక్కాడు. కానీ, ఆయనన నమ్మన బయ్యర్లే నష్టపోయారు. దాదాపు ఈ సినిమా వల్ల బయ్యర్లు సుమారు రూ. 4 కోట్ల వరకు నష్టపోయారట. దీంతో నష్టాలను వెనక్కి ఇవ్వాలని బయ్యర్లు నిర్మాత రాజేష్ దండాకు విజ్ఞప్తి చేశారు. కానీ, ఆయన చూద్దాం అంటూ మాట దాటేస్తూ వచ్చారు.
కానీ, ఇప్పుడు వారిని తిరిగి డబ్బులు ఇవ్వక తప్పని పరిస్థితి రావడంతో బయ్యర్లు నష్టాలను జిఎస్టీతో కలిసి తిరిగి ఇచ్చేసాడట. ప్రస్తుతం ఆయన కిరణ్ అబ్బవరంతో కే రాంప్ (K-Ramp) మూవీ చేస్తున్నాడు. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యూలాయిడ్ బ్యానరల్లో శివ బొమ్మతో కలిసి కే–ర్యాంప్ని రూపొందించాడు. అయితే ఇప్పు ఈ సినిమా విడుదల చేయాలంటే బయ్యర్లు రాజేష్ దండా కండిషన్ పెట్టారట. మజాకా నష్టాలు తిరిగి ఇస్తేనే.. ఈ సినిమా కొట్టామని తేల్చి చెప్పారట. లేదంటే తమ బ్యానర్లో వచ్చే ఏ చిత్రాన్ని కొనమని చెప్పడంతో రాజేష్ దండా మరో దారి లేక బయ్యర్లు రూ. 4 కోట్లు తిరిగి ఇచ్చేసినట్టు సినీవర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.