Sankranthiki Vasthunnam Remake : ఒక భాషలో ఎంతో మంచి విజయం అందుకున్న సినిమాలను మరొక భాషలోకి రీమేక్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతుంది. ఇలా ఇప్పటికే ఎన్నో హిందీ, ఇతర భాష సినిమాలను తెలుగులో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అదేవిధంగా తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న సినిమాలను కూడా ఇతర భాషలలో రీమేక్ చేస్తే అక్కడ కూడా విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక గతేడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vastunnam)సినిమా ఒకటి. 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోయిన్ నటించిన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా హిందీ రీమేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ (Akshya Kumar)నటించబోతున్నట్టు ఇదివరకు వెల్లడించారు. అయితే హీరోయిన్లుగా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై ఇన్ని రోజులు సందిగ్గం నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్లు కూడా దొరికారని తెలుస్తోంది.
ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కు జోడిగా మీనాక్షి చౌదరి(Menakshi Chaudary) ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)నటించబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ తెలుగులో నటించిన సంగతి తెలిసిందే అదే విధంగా బాలీవుడ్ రీమేక్ లో కూడా ఈ ఇద్దరు హీరోయిన్లుగా ఎంపికయ్యారని సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతుంది. ఇక ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇక సంగీతం బీమ్స్ అందించబోతున్నారు.
సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం…
ఇక త్వరలోనే ఈ సినిమా హిందీ రీమేక్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. తెలుగులో ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా సీక్వెల్ పనులపై బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ సీక్వెల్ సినిమాకు “సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం” అనే టైటిల్ తో 2027 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
Also Read: Yellamma Movie: దేవిశ్రీ ఎల్లమ్మ కోసం మరోస్టార్ హీరో .. పక్కాగా ప్లాన్ చేస్తున్న వేణు!