Mitraaw Sharma: బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ(Mitra Sharma) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇటీవల ఈమె పేరు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో వర్జిన్ బాయ్స్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గీతానంద్ (Geetanand), మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్'(Virgin Boys). యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి దయానంద్ (Director Dayanand) దర్శకత్వం వహిస్తుండగా.. రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్పై రాజా దరపునేని నిర్మిస్తున్నారు. శ్రీహాన్(Srihan), జెన్నీఫర్ ఇమాన్యుల్ పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జూలై 11న సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ టీం పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వర్జినిటీ గురించి మిత్రా ఓపెన్ గా చెప్పేసింది.. ఆ వివరాల్లోకి వెళితే..
వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు..?
మిత్రా శర్మ హీరోయిన్ గా నటించిన వర్జిన్ బాయ్స్ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని జనాల్లోకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు. క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి కన్నా పర్సనల్గా ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మీరు వర్జినిటీని ఎప్పుడు కోల్పోయారు అని యాంకర్ అడిగారు.. ముందుగా శ్రీహాన్ ను అడగ్గా.. మొదట ఇలాంటివి బయట పెడితే రిస్క్ అని ఆలోచించాడు ఏమో కానీ కాస్త ఆలోచించి మళ్లీ మళ్లీ అడగడంతో తన గురించి పూర్తి వివరాలను బయట పెట్టాడు. అదేవిధంగా మిత్ర శర్మను కూడా అడిగారు.. మొదట కాస్త సిగ్గుపడి సైలెంట్ అయినా కూడా ఆ తర్వాత ఓపెన్ గా తన ఏజ్ గురించి చెప్పి షాక్ ఇస్తుంది.. ఈరోజుల్లో ఇలాంటివి కామన్ అని క్లారిటీగా చెప్తుంది. ఇకపోతే ఈ వీడియో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా అవుతుంది.
Also Read :లైఫ్ ఇచ్చిన పవన్, ప్రభాస్నే మర్చిపోయింది… తర్వాత సారీ అంటూ కవరింగ్..
వర్జిన్ బాయ్స్ మూవీ..
ఈమధ్య కొత్త కంటెంట్లతో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో ఒక్కొక్కరు ఒక్కో జోనర్ లో సినిమా చేస్తున్నారు.. సినిమా హిట్ అవ్వాలంటే అది యూత్ ఆడియన్స్ కి ఎక్కితే సరిపోతుంది. ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలు ఉంటే చాలు సినిమాను వాళ్లే హిట్ చేస్తారు.. యూత్ ను ఆకట్టుకునే స్టోరీతో ప్రస్తుతం వర్జిన్ బాయ్స్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్, రోనిత్, అన్షులా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయెల్, కౌశల్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అడల్ట్ కామెడీతో పాటు ఎమోషన్స్ ను కూడా చూపించారు. ప్రేమ, పెళ్లి ఎంత గొప్పవి.. ఆకర్షణకు లోనై ముగ్గురు యువకులు చేసిన తప్పు ఏంటి.. ? అనేది ట్విస్ట్ గా చూపించార. ఇక ట్రైలర్ లో మిత్రా శర్మతో పాటు మిగిలిన హీరోయిన్స్ అందాలు హైలైట్ గా నిలుస్తాయని చెప్పొచ్చు.. రీసెంట్గా సెన్సార్ రివ్యూను పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ను సొంతం చేసుకుంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే..