MSVPG Collections: మెగాస్టార్ చిరంజీవి.. నటించిన సంక్రాంతి ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు (MSG) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన రోజునుంచి మంచి టాక్తో పాటు భారీ వసూళ్లు సాధిస్తూ, ప్రతిరోజూ ఏదో ఒక రికార్డ్ను బద్దలుకొడుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు కలెక్షన్లలో సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ను నమోదు చేసింది.
దర్శకుడు అనిల్ రావిపూడి.. తెరకెక్కించిన ఈ చిత్రం, ఐదో రోజు ఏపీ..తెలంగాణ కలిపి రూ.14.70 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇది ఇంతకు ముందు ఉన్న రికార్డ్ను మించి పోయింది. ఆ రికార్డ్ను RRR సినిమా నెలకొల్పింది. ఆ చిత్రం ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.13 కోట్ల షేర్ను సాధించింది. ఇప్పుడు MSG ఆ రికార్డ్ను అధిగమించి..ఐదో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
టికెట్ అమ్మకాల పరంగా కూడా ఈ సినిమా అదరగొడుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే BookMyShowలో 2.5 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఈ సినిమా క్రేజ్ను స్పష్టంగా చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ను దాటింది. మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.226 కోట్లకు పైగా నమోదయ్యాయి.
సినిమాకు ఇంకా వేగం తగ్గేలా కనిపించడం లేదు. అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు మంచి ఫుట్ఫాల్స్ కనిపిస్తున్నాయి. వీకెండ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఈ రోజు మరియు రేపు మరింత భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వస్తుండటంతో, సంక్రాంతి సీజన్లో ఈ సినిమా రన్ ఇంకా బలంగా కొనసాగనుంది.
ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా వీకెండ్ అడ్వాంటేజ్తో MSG మరింత పికప్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా చూస్తే, మెగాస్టార్ చరిష్మా, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఆపలేని విజయంగా మార్చాయి.
Also Read: Chiranjeevi: వెంకీ సినిమాలో చిరు క్యామియో? డైరెక్టర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్