E-Paper
Advertisement

Murali Mohan: లేట్ అయినా లేటెస్టుగా వచ్చింది.. ‘పద్మశ్రీ’పై మురళీ మోహన్ ఫస్ట్ రియాక్షన్

Murali Mohan: లేట్ అయినా లేటెస్టుగా వచ్చింది.. ‘పద్మశ్రీ’పై మురళీ మోహన్ ఫస్ట్ రియాక్షన్
Advertisement

Murali Mohan: భారత ప్రభుత్వం ప్రతి ఏడాది వివిధ రకాల పురస్కారాలను ప్రకటిస్తూ వివిధ రంగాలలో పనిచేస్తున్న వారిని ప్రోత్సహించడమే కాకుండా వారిని అవార్డుల పేరుతో సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో పద్మ అవార్డులు కూడా ఎంతో కీలకమైనవి. ప్రతి ఏడాది పద్మ అవార్డులను ప్రకటిస్తూ వస్తారు. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డేను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితా విడుదల చేసింది. ఈ ఏడాది ఏకంగా 131 మందికి ఈ పద్మ అవార్డులను ప్రకటించింది.

పద్మశ్రీ రావడం సంతోషంగా ఉంది..

ఇందులో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సీనియర్ నటుడు మాగంటి మురళీమోహన్ కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తనకు పద్మశ్రీ అవార్డు(Padma Shri Award) దక్కడం పట్ల సీనియర్ నటుడు మురళీమోహన్ (Murali Mohan)సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈయన పద్మ అవార్డుల పట్ల స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో భాగంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు ఆదివారం సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మీడియా వారు ఎంతోమంది ఫోన్లో చేసే అభినందనలు తెలియజేస్తున్నారు. వారందరితో నా సంతోషాన్ని పంచుకోవడం మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.

ఈ పురస్కారం ఎప్పుడో రావాల్సింది..

Advertisement

ఇక చాల మంది ఈ విషయం గురించి ఫోన్లు చేస్తూ మీకు ఈ పురస్కారం ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడు వచ్చింది అంటూ మాట్లాడుతున్నారు. ఈ అవార్డు తనకు లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చిందని అన్ని మనం అనుకున్నప్పుడే రావు, ప్రతిదానికి సమయం ఉంటుందని, మనం ఎదురు చూసినప్పుడు వచ్చే వాటికే విలువ ఎక్కువ అంటూ ఈ సందర్భంగా మురళీమోహన్ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి గొప్ప పురస్కారాన్ని తనకు అందించిన ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే అభిమానులు చిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు.

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం..

Advertisement

గత ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో ఎనలేని సేవలు చేసిన మురళీమోహన్ కృషిని గుర్తించి ఆయనకు భారత ప్రభుత్వం అత్యుత్తమమైన పురస్కారాన్ని ప్రకటించడంతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరొక నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇక మురళీమోహన్ ఇండస్ట్రీలో హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇప్పటికి పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

Also Read: Sumathi Sathakam film: బిగ్ బాస్ అమర్ దీప్ సుమతీ శతకం రిలీజ్ డేట్ ఫిక్స్ ..

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×