E-Paper
Advertisement

Tollywood: మిగిలింది ఆ ఇద్దరు హీరోలే.. ఈ ఏడాదైనా ఆ బెంచ్ మార్క్ అందుకుంటారా?

Tollywood: మిగిలింది ఆ ఇద్దరు హీరోలే.. ఈ ఏడాదైనా ఆ బెంచ్ మార్క్ అందుకుంటారా?
Advertisement

Tollywood:ఒకప్పుడు హీరోల విజయం అంటే వారి సినిమాలు ఎన్ని థియేటర్లలో ఎన్ని రోజులు ప్రదర్శించబడ్డాయి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఏ హీరో ముందుగా అత్యధిక కలెక్షన్లు రాబడుతున్నారు అనే విషయాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యకాలంలో రూ.100 కోట్ల మార్క్ బెంచ్ అనేది అందరికీ అత్యవసరంగా మారిపోయింది. ఒకప్పుడు రూ.50 కోట్ల షేర్ రాబడితే చాలు ఆ హీరోలు స్టార్ హీరోలుగా చలామణి అయ్యేవారు. కానీ మా కాలం మారుతున్న కొద్దీ యంగ్ హీరోలు కూడా ఈ మార్కును అవలీలగా దాటేస్తుంటే.. ఆ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఇంకా ఆ మార్కును అందుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

సవాల్ గా మారిన రూ.100 కోట్ల షేర్..

ఇకపోతే ఈతరం హీరోలైన రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్ (NTR) , ప్రభాస్(Prabhas ), మహేష్ బాబు (Maheshbabu) లాంటి హీరోలు రూ.100 కోట్ల షేర్ రాబట్టడం వారికి మరింత సులభంగా మారిపోయింది. దీనికి తోడు ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయినా భారీ కలెక్షన్స్ వసూల్ చేస్తూఈ. ఈ సినిమా కూడా అప్పుడే వందకోట్ల షేర్ రాబట్టి కమర్షియల్ గా విజయం సాధించింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా 100 కోట్ల షేర్ మార్కు దాటేసి సంచలనం సృష్టించింది.

బాలయ్య ఆ మార్క్ సాధిస్తారా?

Advertisement

ఇక అంతేకాదు యంగ్ హీరోగా పేరు దక్కించుకున్న తేజ సజ్జ కూడా ‘హనుమాన్’ చిత్రంతో ఈ మార్క్ అందుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అలా చిన్న హీరోలు కూడా ఈ 100 కోట్ల షేర్ రాబడుతూ రికార్డు సృష్టిస్తుంటే.. నాగార్జున(Nagarjuna), బాలకృష్ణ (Balakrishna) మాత్రం ఆ బెంచ్ మార్కుకి చేరువలోకి వెళ్తున్నారే కానీ దానిని అందుకోవడం కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా బాలకృష్ణ అఖండ, డాకూ మహారాజ్ చిత్రాలతో ఈ మార్కును అందుకుంటారు అనుకున్నారు. కానీ 70 కోట్ల షేర్ వరకు రాబట్టి అక్కడే ఆగిపోయారు. పైగా ఇటీవల వచ్చిన అఖండ ఈ సినిమాతో రీచ్ సాధిస్తారు అని అనుకున్నప్పటికీ అది కూడా కుదరలేదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే ఆదిత్య 369 సీక్వెల్ లో కూడా బాలకృష్ణ నటిస్తున్నారు. కనీసం ఈ రెండు చిత్రాలతోనైనా బాలయ్య ఈ మార్కును టచ్ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ALSO READ:Dhanush: చిక్కుల్లో పడ్డ ధనుష్ కొత్త మూవీ.. రూ.84 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్!

నాగార్జున సంగతేంటి?

Advertisement

నాగార్జున.. ఇప్పటివరకు స్టార్ హీరోగా ప్రేక్షకులను అలరించిన ఈయన గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. హీరోగా సినిమా చేయాలి అని , ఆ 100 కోట్ల షేర్ మార్కును అందుకొని, ఆయన కూడా ఈ జాబితాలోకి చేరిపోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే తన 100వ సినిమాతో ఈ మార్కును బీట్ చేయడానికి సిద్ధమయ్యారు నాగార్జున. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో తన 100వ సినిమా కోసం సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో కచ్చితంగా ఈ మార్కు అందుకుంటారని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నాగార్జున, బాలకృష్ణ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిద్దరూ కూడా ఈ మార్కు టచ్ చేయాలని అభిమానులు, అటు ఇండస్ట్రీ వర్గాలు కూడా అభిప్రాల వ్యక్తం చేస్తున్న.

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×