E-Paper
Advertisement

Dhanush: చిక్కుల్లో పడ్డ ధనుష్ కొత్త మూవీ.. రూ.84 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్!

Dhanush: చిక్కుల్లో పడ్డ ధనుష్ కొత్త మూవీ.. రూ.84 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్!
Advertisement

Dhanush: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ధనుష్ (Dhanush ) ఒకవైపు హీరోగా.. మరొకవైపు దర్శకుడిగా.. ఇంకొకవైపు నిర్మాతగా ఇలా పలు విభాగాలలో పని చేస్తూ సత్తా చాటుతున్నారు. ఇక తెలుగు, తమిళ్ భాషలలో సినిమాలు చేయడమే కాకుండా ఇప్పుడు హిందీలో కూడా నేరుగా సినిమాలు చేస్తూ అక్కడే నార్త్ ఆడియన్స్ కి కూడా దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన చిత్రం తేరే ఇష్క్ మే. ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మరి కొన్ని రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి కూడా సిద్ధమయ్యింది.

చిక్కుల్లో పడ్డ తేరే ఇష్క్ మే..

అలాంటి ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే ధనుష్, కృతి సనన్ జంటగా వచ్చిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 28న తేరే ఇష్క్ మే పేరుతో హిందీ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో అమర కావ్యం అని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ చిత్రంపై ఈరోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ముంబై కోర్ట్ ను ఆశ్రయించింది. ఈ మూవీ దర్శకుడు, నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ పై నష్టపరిహారం కోసం కోర్టుమెట్లు ఎక్కినట్లు సమాచారం.

ఆ ప్రచారమే దర్శకుడిని చిక్కుల్లో పడేసిందా?

Advertisement

విషయంలోకి వెళితే.. తేరే ఇష్క్ మే సినిమా విడుదల సమయంలో ధనుష్ హీరోగా, ఈరోస్ నిర్మాణంలో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రాంఝణా. ఈ సినిమాకు సీక్వెల్ తేరే ఇష్క్ మే అని ప్రచారం చేశారు. 2013లో 35 కోట్లతో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా.. బాక్స్ ఆఫీస్ వద్ద 105 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. దీంతో ఈ చిత్ర యూనిట్ కి మంచి ఇమేజ్ కూడా లభించింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ అని పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ దీనిని ఈరోస్ సంస్థ తప్పు పట్టింది. తమ ప్రమేయం లేకుండా సీక్వెల్ ఎలా ప్రకటిస్తారు? అంటూ ముంబై కోర్టును ఆశ్రయించింది.పైగా రాంఝణా సినిమాకు సీక్వెల్ అని చెప్పుకొని భారీ లాభపడ్డారని ఆ సంస్థ తెలిపింది. ఇక ఆనంద్ చర్యల వల్లే తమ సినిమా ఇమేజ్ దెబ్బతినిందని, అందుకు నష్టపరిహారంగా 84 కోట్లు ఇవ్వాలి అని ఈరోస్ సంస్థ కోరింది..

ఆ హక్కులు పూర్తిగా మావే..

ఇకపోతే ఈ సినిమా హక్కులు పూర్తిగా తమవేనని, ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ కేవలం దర్శకుడు మాత్రమేనని ఈరోస్ సంస్థ ఆరోపించింది. మొత్తానికైతే ధనుష్ కొత్త సినిమాకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరి దీనిపై తేరే ఇష్క్ మే నిర్మాతలు ఇప్పటివరకు స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే వారు ఈ నష్టపరిహారాన్ని చెల్లిస్తారా లేక ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన దర్శకుడు ఆనంద్ ఈ భారాన్ని మోస్తారా అన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది..

Advertisement

ALSO READ:Rajinikanth: స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. అసలేమైందంటే?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×