E-Paper
Advertisement

Balakrishna: హీరోయిన్ కాళ్ళు మొక్కిన బాలకృష్ణ..నెటిజన్స్ రియాక్షన్ ఇదే!

Balakrishna: హీరోయిన్ కాళ్ళు మొక్కిన బాలకృష్ణ..నెటిజన్స్ రియాక్షన్ ఇదే!
Advertisement

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ఇలా ఒకవైపు ఈయన సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయ వ్యవహారాలలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ(Balakrishna) గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ(IFFD) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

బాలయ్య సంస్కారానికి అభిమానులు ఫిదా..

ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా బాలకృష్ణ సీనియర్ నటి హేమమాలిని(Hema Malini)కి పాదాభివందనాలు చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న బాలయ్య ఇలా మరో నటికి పాదాభివందనాలు చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది. ఈ వీడియో పట్ల నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. బాలయ్య సంస్కారం చూసి అభిమానులు ఫిదా అవ్వగా మరి కొంతమంది మాత్రం మొదటిసారి బాలయ్య ఇలా ఇతరుల కాళ్లు నమస్కరించడం అంటూ కామెంట్ చేస్తున్నారు.

హేమామాలినికి బాలయ్య పాదాభివందనం..

Advertisement

సాధారణంగా బాలకృష్ణ ఎవరికీ పాదాభివందనం చేస్తున్న సందర్భాలు ఎక్కడా లేవు అది కూడా హీరోయిన్ల కాళ్లకు నమస్కారం చేసిన సందర్భాలు ఎక్కడ లేదు కానీ మొదటిసారి హేమమాలినికి పాదాభివందనం చేయటంతో బాలయ్య చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలకృష్ణ ఇండస్ట్రీలో అగ్రస్థాయి హీరోగా కొనసాగుతున్నారు మరోవైపు మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాలలో కూడా ఉన్నత హోదాలో ఉన్నారు అలాంటి వ్యక్తి తన పరపతి పక్కన పెట్టి పాదాభివందనం చేయడం పట్ల అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే..

నిరాశపరిచిన అఖండ 2..

Advertisement

బాలకృష్ణ ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకూల స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశను మాత్రమే మిగిల్చింది. సినిమా తర్వాత బాలకృష్ణ తన 111 వ సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేయబోతున్నారు. ఈ సినిమా ఇటీవల రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడిగా మరోసారి నయనతార(Nayanthara) హీరోయిన్ గా కనిపించబోతున్నారు. ఇదివరకే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే సినిమాలో నటించారు ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Vijay Rashmika: విజయ్ రష్మిక ‘బడ్డీమూన్’ విల్లా ఒక్క రాత్రికి రెంట్ ఎంతో తెలిస్తే మతిపోతుంది!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×