E-Paper
Advertisement

Tollywood: ఆ పార్ట్ కి కూడా మేకప్ వేసుకోవాలని బలవంత పెట్టారు.. ఎన్టీఆర్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్!

Tollywood: ఆ పార్ట్ కి కూడా మేకప్ వేసుకోవాలని బలవంత పెట్టారు.. ఎన్టీఆర్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్!
Advertisement

Tollywood:సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలి అంటే కొన్ని విషయాలలో కచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని కొంతమంది హీరోయిన్స్ చెబుతుంటే.. మరికొంతమంది అలాంటి వాటికి కాంప్రమైజ్ కాలేక ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత నిర్మొహమాటంగా తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా చెబుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఎన్టీఆర్(NTR ) తో అశోక్, నరసింహుడు వంటి చిత్రాలు చేసి మంచి పేరు సంపాదించుకున్న సమీరారెడ్డి (Sameera Reddy) పెళ్లి చేసుకొని ఇంటికే పరిమితమైంది. కానీ సడన్గా ఈమధ్య మళ్ళీ ఒక సినిమా అవార్డు వేడుకలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. బాగా బరువు పెరిగిపోయిన ఈమె.. కసరత్తుల చేస్తూ బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

ఆ పార్ట్ కి మేకప్ వేసుకోమని ఇబ్బంది పెట్టారు..

ఇకపోతే సినిమా పరిశ్రమలో ఉన్న కలర్ డిస్క్రిమినేషన్ తోపాటు బాడీ షేమింగ్ పై నటి సమీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి.. తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ” నన్ను సినిమా పరిశ్రమలో ఉన్న తెల్లతోలు వ్యామోహం ఉన్న కొంతమంది చాలా ఇబ్బంది పెట్టారు. అసలు రంగు కంటే ఇంకా తెల్లగా కనిపించాలని.. ముఖానికే కాకుండా ఎక్కడైతే శరీరం బయటకు కనిపిస్తుందో అక్కడ కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేసేవారు. అలా వాళ్ళు చెప్పడం వల్ల నేను అందంగా ఉండనేమో అనే భావన నాలో కలిగేది.

బాడీ షేమింగ్ కూడా తప్పలేదంటూ..

Advertisement

అలాగే పొట్టిగా ఉండటం వల్ల లావుగా ఉందంటూ విమర్శలు చేశారు. సినీ పరిశ్రమలో టాలెంట్ కన్నా కూడా బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నన్ను మానసికంగా కూడా కలిచివేసింది. ఇక పెళ్లి తర్వాత మొదటి సంతానం కలిగింది. దాంతో పోస్ట్ పార్టమ్ వెయిట్ గైన్ అవ్వడం వల్ల నా ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాను.. ఆ సమయంలో నెటిజన్స్ నుండి ఎదురైన విమర్శలు మానసికంగా నన్ను ఆవేదనకు గురి చేశాయి. ఇక రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసినా.. ఆ నెగిటివ్ కామెంట్స్ చూస్తే నాకేమీ అనిపించడం లేదు. నేను ప్రస్తుతం న్యూట్రల్ గానే ఉన్నాను” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి.

ALSO READ:Harish Shankar: పవన్ విషయంలో స్వార్థం.. డైరెక్టర్ ఏమన్నారంటే?

సమీరా రెడ్డి కెరియర్..

Advertisement

హిందీ చిత్రం ద్వారా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. నరసింహుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జై చిరంజీవ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇక ప్రస్తుతం రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×