E-Paper
Advertisement

Teja Sajja: తేజా సజ్జా లైనప్ అదిరింది.. ఒకేసారి రెండు సీక్వెల్స్.. జై హనుమాన్ లేనట్లే..?

Teja Sajja: తేజా సజ్జా లైనప్ అదిరింది.. ఒకేసారి రెండు సీక్వెల్స్.. జై హనుమాన్ లేనట్లే..?
Advertisement

Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో స్టార్ హీరోల సరసన నటించాడు.. హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తేజ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన గతంలో చేసిన సినిమాలు అన్నీ కూడా పర్వాలేదు అని అనిపించాయి కానీ బిగ్గెస్ట్ హిట్ మాత్రం అందివ్వలేదు. ఈమధ్య వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ వస్తున్నాడు తేజ.. హనుమాన్, మిరాయ్ మూవీలతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. మిరాయ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా తేజా మరో రెండు సీక్వెల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఆ మూవీల గురించి తెలుసుకుందాం..

భారీ బడ్జెట్ చిత్రాలకు తేజా గ్రీన్ సిగ్నల్..

రీసేంట్ గా మిరాయ్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడేమో సీక్వెల్స్ లో నటిస్తున్నాడు. త్వరలో ‘జాంబిరెడ్డి 2′, ‘మిరాయ్‌ 2’ సినిమాలను సమాంతరంగా పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం జనవరి మధ్యలో ‘జాంబిరెడ్డి 2’, మార్చిలో ‘మిరాయ్‌ 2’ సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.. ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. తేజ సజ్జా వరుస పాన్‌ ఇండియా విజయాల తర్వాత చేస్తున్న ఈ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.. మార్చి నాటికి ‘మిరాయ్‌ 2’ షూట్‌ ప్రారంభం కానుందని సమాచారం.. సీక్వెల్ మూవీలో భారీ విజువల్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.. ఈ సినిమాల గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది..

Advertisement

Also Read : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు.. ఆ 5 మిస్ అవ్వకండి..

జై హనుమాన్ అటకెక్కినట్లేనా..? 

హీరో తేజా సజ్జా నటించిన హనుమాన్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేయడంతో తేజ ఖాతాలో బిగ్గెస్ట్ హెట్ పడిపోయింది.. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతున్నా కూడా సెట్స్ మీదకి ఇంకా వెళ్ళలేదు. ఆ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ ని త్వరలోనే తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు నిర్మాతల మధ్య గొడవల కారణంగా ఆ సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.. ఆ మధ్య ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని డైరెక్టర్ చెప్పారు. ఇక ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎక్కడ ప్రస్తావించినా దాఖలాలు లేవు.. ఇప్పుడు నిర్మాతలకు, డైరెక్టర్ కు మధ్య జరుగుతున్న గొడవల కారణంగా ఈ సినిమా ఇక ఎప్పటికీ లేనట్లే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏమైన స్పందిస్తారేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందే అంటూ తేజ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు…

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×