Priyanka Chopra: ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే మొదటిసారి నేరుగా ఒక తెలుగు సినిమాలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రియాంక చోప్రా రాజమౌళి (Rajamouli)మహేష్ బాబు (Mahesh Babu)కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మందాకిని పాత్రలో కనిపించబోతున్నారని చిత్ర బృందం వెల్లడించారు. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించి బిగ్ ఈవెంట్ జరగబోతున్న సంగతి తెలిసిందే నవంబర్ 15వ తేదీ గ్లోబ్ ట్రాటర్ పేరిట ఈ సినిమా వేడుక జరుగునుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాకు సంబంధించి గ్లింప్ కూడా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అలాగే చిత్ర బృందం మొత్తం హైదరాబాద్లోనే సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేస్తూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా ద్వారా తిరిగి తాను భారతీయ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుందని తెలిపారు. ఇక రాజమౌళితో పనిచేయడం కస్టమా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తనకు కష్టమేమీ కాలేదని అయితే ఈ సినిమా ఖచ్చితంగా నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సినిమా కోసం తాను తెలుగు కూడా నేర్చుకుంటున్నానని తెలుగులో డైలాగ్ చెప్పడం కోసం రాజమౌళి గారు తనకు చాలా సహాయం చేస్తున్నారని కచ్చితంగా తెలుగు మాట్లాడటంలో మీ అందరి అంచనాలను చేరుకుంటాను అంటూ ఈ సినిమా కోసం ఈమె పడుతున్న కష్టాలను కూడా తెలిపారు.
ఇండస్ట్రీ చూపు మొత్తం గ్లోబ్ ట్రాటర్ పైనే…
ఇక ఈ చిట్ చాట్ లో భాగంగా హైదరాబాద్ బిర్యానీ గురించి కూడా ప్రస్తావనకు రావడంతో ప్రపంచంలో బెస్ట్ బిర్యానీ ఎక్కడైనా దొరుకుతుంది అంటే అది హైదరాబాదీ బిర్యాని అంటూ ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం గ్లోబ్ ట్రాటర్ ఈ వెంట పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఎప్పుడు నిర్వహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ సినీ ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పైనే ఉందని చెప్పాలి.
Also Read: SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 లో మాధవన్ .. ఒక్క పోస్టుతో లీక్ చేసిన హీరో?