GlobeTrotter Event : బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన పేరు సాధించుకున్న చాలామంది హీరోయిన్స్ తెలుగులో కూడా సినిమాలు చేశారు. అయితే కేవలం వాళ్ళు ఒకటి రెండు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో కనిపించింది కత్రినా కైఫ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.
ఇక ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొనే. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు దీపికా పదుకొనే ను కొన్ని సినిమాల నుంచి తప్పిస్తున్నారు. ఆల్రెడీ స్పిరిట్ మరియు కల్కి సినిమాల నుంచి బయటకు వచ్చేసింది.
ఇక ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా టైటిల్ కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మందాకిని అనే పాత్రలో కనిపిస్తుంది ప్రియాంక చోప్రా.
ప్రియాంక చోప్రా ఈవెంట్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. అలానే సినిమా అయిపోయేలోపు కంప్లీట్ తెలుగు స్పీచ్ ఇస్తాను అంటూ అభిమానులకు హామీ ఇచ్చింది.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసిన కూడా ఆ సినిమా మంచి హై ఇస్తుంది. ఆ సినిమాలోని మైండ్ తో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతా అనే డైలాగ్ను స్టేజ్ పైన చెప్పి అలరించింది ప్రియాంక చోప్రా.
Also Read: GlobeTrotter Event : రాజమౌళి షూటింగ్ లో నన్ను టార్చర్ పెట్టాడు