E-Paper
Advertisement

Akhanda 2 Publice Reaction: అఖండ 2పై పబ్లిక్ రియాక్షన్.. అసలు వీరు మారరా?

Akhanda 2 Publice Reaction: అఖండ 2పై పబ్లిక్ రియాక్షన్.. అసలు వీరు మారరా?
Advertisement

Akhanda 2 Public Reaction: బాలకృష్ణ బోయపాటి కాంబోలో సినిమా అంటేనే సినిమా పట్ల మంచి అంచనాలు ఉంటాయి. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక తాజాగా ఆఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ కథతో బోయపాటి ఈ సినిమాని సాగదీసారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాలకృష్ణ అభిమానులు మాత్రం సినిమా అద్భుతంగా ఉంది అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

కొత్తదనం మిస్సయిందా?

ఈ సినిమాలో వైరస్ ను చంపే యాంటీ డోట్ ప్రజలకు ఎలా చేరవేయాలనే ఒక చిన్న పాయింట్ తో ఈ సినిమాని సాగదీసారని చెప్పాలి. అఖండ 2 సినిమాను కేవలం బాలకృష్ణ అఘోర పాత్ర కోసమే చూడాలి తప్పితే కొత్త కంటెంట్ ఏమి లేదని తెలుస్తోంది. ఒక బాలయ్య అభిమానులకు మాత్రమే ఈ సినిమా మంచి ఊపునిస్తుంది కానీ ప్రేక్షకులకు మాత్రం ఒక చిన్న పరీక్ష లాంటిదే అని చెప్పాలి. ఈ సినిమా కథలో లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలను పెట్టడంతో ప్రేక్షకులు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే చెప్పాలి. ఇక తమన్ బిజీఏం కూడా కాస్త ఎబెట్టుగానే అనిపించింది.

పరవాలేదు అనిపించిన అఖండ 2..

Advertisement

ఇలా బోయపాటి తమన్ బాలయ్య కాంబినేషన్లో అఖండ 2 సినిమా చూస్తుంటే కొత్త సినిమా చూసిన భావన ఏమాత్రం కలగలేదని ఈ విషయంలో వీరి తీరు మార్చుకోవాల్సిందేనని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కాకుండా ఏ హీరో అయినా నటించి ఉంటే ఇంత హైప్ఉండేది కాదని కూడా స్పష్టం అవుతుంది. బాలకృష్ణ సినిమాల విషయంలో తమన్ బోయపాటి ఇద్దరు కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఖండ 2 బాలయ్య అభిమానులకు మంచి ఊపు ఇచ్చిన సాధారణ ప్రేక్షకులకు మాత్రం పరవాలేదు అనే భావనను కలిగిస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో నటించిన సంగతి తెలిసిందే. బాలమురళీకృష్ణ ఎమ్మెల్యేగా ఒక పాత్రలో నటించారు. మరొక పాత్రలో ఆ ఘోరంగా కనిపిస్తారు. అఘోర పాత్ర హైలెట్ అనిపించిన ఈ పాత్రకు సంబంధించి ఎక్కువ నిడివి లేకపోవటం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే బాలకృష్ణ కూతురి పాత్రలో బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా జనని అనే పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఇక విలన్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టిని చంపేయడం కూడా కాస్త సిల్లీగానే ఉందని చెప్పాలి.

Also Read: Bhagya Shri Borse: మద్యపాన నిషేధం నేపథ్యంలో భాగ్యశ్రీ కొత్త సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×