E-Paper
Advertisement

Akhanda 2 Publice Reaction: అఖండ 2పై పబ్లిక్ రియాక్షన్.. అసలు వీరు మారరా?

Akhanda 2 Publice Reaction: అఖండ 2పై పబ్లిక్ రియాక్షన్.. అసలు వీరు మారరా?
Advertisement

Akhanda 2 Public Reaction: బాలకృష్ణ బోయపాటి కాంబోలో సినిమా అంటేనే సినిమా పట్ల మంచి అంచనాలు ఉంటాయి. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక తాజాగా ఆఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ కథతో బోయపాటి ఈ సినిమాని సాగదీసారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాలకృష్ణ అభిమానులు మాత్రం సినిమా అద్భుతంగా ఉంది అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

కొత్తదనం మిస్సయిందా?

ఈ సినిమాలో వైరస్ ను చంపే యాంటీ డోట్ ప్రజలకు ఎలా చేరవేయాలనే ఒక చిన్న పాయింట్ తో ఈ సినిమాని సాగదీసారని చెప్పాలి. అఖండ 2 సినిమాను కేవలం బాలకృష్ణ అఘోర పాత్ర కోసమే చూడాలి తప్పితే కొత్త కంటెంట్ ఏమి లేదని తెలుస్తోంది. ఒక బాలయ్య అభిమానులకు మాత్రమే ఈ సినిమా మంచి ఊపునిస్తుంది కానీ ప్రేక్షకులకు మాత్రం ఒక చిన్న పరీక్ష లాంటిదే అని చెప్పాలి. ఈ సినిమా కథలో లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలను పెట్టడంతో ప్రేక్షకులు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే చెప్పాలి. ఇక తమన్ బిజీఏం కూడా కాస్త ఎబెట్టుగానే అనిపించింది.

పరవాలేదు అనిపించిన అఖండ 2..

Advertisement

ఇలా బోయపాటి తమన్ బాలయ్య కాంబినేషన్లో అఖండ 2 సినిమా చూస్తుంటే కొత్త సినిమా చూసిన భావన ఏమాత్రం కలగలేదని ఈ విషయంలో వీరి తీరు మార్చుకోవాల్సిందేనని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కాకుండా ఏ హీరో అయినా నటించి ఉంటే ఇంత హైప్ఉండేది కాదని కూడా స్పష్టం అవుతుంది. బాలకృష్ణ సినిమాల విషయంలో తమన్ బోయపాటి ఇద్దరు కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఖండ 2 బాలయ్య అభిమానులకు మంచి ఊపు ఇచ్చిన సాధారణ ప్రేక్షకులకు మాత్రం పరవాలేదు అనే భావనను కలిగిస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో నటించిన సంగతి తెలిసిందే. బాలమురళీకృష్ణ ఎమ్మెల్యేగా ఒక పాత్రలో నటించారు. మరొక పాత్రలో ఆ ఘోరంగా కనిపిస్తారు. అఘోర పాత్ర హైలెట్ అనిపించిన ఈ పాత్రకు సంబంధించి ఎక్కువ నిడివి లేకపోవటం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే బాలకృష్ణ కూతురి పాత్రలో బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా జనని అనే పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఇక విలన్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టిని చంపేయడం కూడా కాస్త సిల్లీగానే ఉందని చెప్పాలి.

Also Read: Bhagya Shri Borse: మద్యపాన నిషేధం నేపథ్యంలో భాగ్యశ్రీ కొత్త సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్!

Related News

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

Big Stories

Advertisement
×