E-Paper
Advertisement

Akhanda 2 Publice Reaction: అఖండ 2పై పబ్లిక్ రియాక్షన్.. అసలు వీరు మారరా?

Akhanda 2 Publice Reaction: అఖండ 2పై పబ్లిక్ రియాక్షన్.. అసలు వీరు మారరా?

Akhanda 2 Public Reaction: బాలకృష్ణ బోయపాటి కాంబోలో సినిమా అంటేనే సినిమా పట్ల మంచి అంచనాలు ఉంటాయి. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక తాజాగా ఆఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ కథతో బోయపాటి ఈ సినిమాని సాగదీసారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాలకృష్ణ అభిమానులు మాత్రం సినిమా అద్భుతంగా ఉంది అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

కొత్తదనం మిస్సయిందా?

ఈ సినిమాలో వైరస్ ను చంపే యాంటీ డోట్ ప్రజలకు ఎలా చేరవేయాలనే ఒక చిన్న పాయింట్ తో ఈ సినిమాని సాగదీసారని చెప్పాలి. అఖండ 2 సినిమాను కేవలం బాలకృష్ణ అఘోర పాత్ర కోసమే చూడాలి తప్పితే కొత్త కంటెంట్ ఏమి లేదని తెలుస్తోంది. ఒక బాలయ్య అభిమానులకు మాత్రమే ఈ సినిమా మంచి ఊపునిస్తుంది కానీ ప్రేక్షకులకు మాత్రం ఒక చిన్న పరీక్ష లాంటిదే అని చెప్పాలి. ఈ సినిమా కథలో లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలను పెట్టడంతో ప్రేక్షకులు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే చెప్పాలి. ఇక తమన్ బిజీఏం కూడా కాస్త ఎబెట్టుగానే అనిపించింది.

పరవాలేదు అనిపించిన అఖండ 2..

ఇలా బోయపాటి తమన్ బాలయ్య కాంబినేషన్లో అఖండ 2 సినిమా చూస్తుంటే కొత్త సినిమా చూసిన భావన ఏమాత్రం కలగలేదని ఈ విషయంలో వీరి తీరు మార్చుకోవాల్సిందేనని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కాకుండా ఏ హీరో అయినా నటించి ఉంటే ఇంత హైప్ఉండేది కాదని కూడా స్పష్టం అవుతుంది. బాలకృష్ణ సినిమాల విషయంలో తమన్ బోయపాటి ఇద్దరు కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఖండ 2 బాలయ్య అభిమానులకు మంచి ఊపు ఇచ్చిన సాధారణ ప్రేక్షకులకు మాత్రం పరవాలేదు అనే భావనను కలిగిస్తుంది.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో నటించిన సంగతి తెలిసిందే. బాలమురళీకృష్ణ ఎమ్మెల్యేగా ఒక పాత్రలో నటించారు. మరొక పాత్రలో ఆ ఘోరంగా కనిపిస్తారు. అఘోర పాత్ర హైలెట్ అనిపించిన ఈ పాత్రకు సంబంధించి ఎక్కువ నిడివి లేకపోవటం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే బాలకృష్ణ కూతురి పాత్రలో బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా జనని అనే పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఇక విలన్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టిని చంపేయడం కూడా కాస్త సిల్లీగానే ఉందని చెప్పాలి.

Also Read: Bhagya Shri Borse: మద్యపాన నిషేధం నేపథ్యంలో భాగ్యశ్రీ కొత్త సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్!

Related News

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

Big Stories

×