1 Year for Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2) సినిమా విడుదల అయ్యి నేటికి సరిగ్గా ఏడాది పూర్తిచేసుకుంది. డిసెంబర్ 5, 2024వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి.
ఈ సినిమా విడుదల అయ్యి నేటికి సరిగ్గా ఏడాది కావడంతో అభిమానుల కోసం హైదరాబాద్ బాలానగర్ లోని విమల్ థియేటర్లో పుష్ప 2 స్పెషల్ షో వేశారు. కేవలం సింగిల్ షో మాత్రమే కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడటానికి ఎంతో ఆసక్తి కనబరిచారు . ఈ క్రమంలోనే అభిమానుల మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయని తెలుస్తోంది. ఈ సినిమా టికెట్లను ఆన్లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సినిమా 4 వ తేదీ సాయంత్రం ప్రసారం కాగా నవంబర్ 30వ తేదీ థియేటర్ వద్ద ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను ఆఫ్లైన్ ద్వారా విడుదల చేశారు దీంతో సినిమా టికెట్ల విషయంపై పెద్ద ఎత్తున గందరగోల పరిస్థితులు ఏర్పడటమే కాకుండా అభిమానులు కొట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ఆఫ్లైన్స్ ద్వారా టికెట్లను జారీ చేయడంతో కొంతమంది అభిమానులకు సినిమా టికెట్లు దొరకకపోవడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఈ విషయంపై రెండు వర్గాల మధ్య టికెట్ల విషయంలో గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని తెలుస్తోంది. ఇలా పుష్ప 2 సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల అయ్యి మరోసారి ఇలాంటి గొడవ చోటు చేసుకోవడంతో కాస్త గందరగోళ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది కూడా ఇలాగే గొడవలు చోటు చేసుకోవడంతో అల్లు అర్జున్ ఏకంగా జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట..
గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ ప్రీమియర్లు ప్రసారమైన నేపథ్యంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి సంధ్యా థియేటర్ వద్దకు వెళ్లారు. ఇక అల్లు అర్జున్ వస్తున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఒకసారిగా ఆయనని చూడటం కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన కారణంగా రేవతి అనే అభిమాని మరణించడమే కాకుండా తన కుమారుడు శ్రీ తేజ్ ఇప్పటికీ చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఇక ఈ వివాదం కారణంగా అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడంతో ఈయనని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా గొడవలు చోటు చేసుకోవడంతో అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు.
'పుష్ప 2' రీ రిలీజ్.. కర్రలతో కొట్టుకున్న ఫ్యాన్స్
బాలానగర్లోని విమల్ థియేటర్లో పుష్ప 2 రీ-రిలీజ్ సందర్భంగా అభిమానులు ఘర్షణ పడ్డారు. టికెట్ల విషయంలో గొడవ మొదలై, రెండు వర్గాల మధ్య చిలికి చిలికి గాలివానలా మారింది. టికెట్లు ఇవ్వలేదని కొందరు ఆందోళనకు దిగగా, వారి మధ్య గొడవ పెద్దదై… pic.twitter.com/ywkbDMGhka
— ChotaNews App (@ChotaNewsApp) December 5, 2025
Also Read: Akhanda 2 : కట్టాల్సింది 70 కోట్లు కాదు.. 90 కోట్లు.. తవ్వేకొద్ది బయట పడుతున్న నిర్మాతల బొక్కలు