Varanasi Movie: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, గ్లోబల్ లెవెల్ కటౌట్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. అనౌన్స్మెంట్ రోజు నుంచే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న ఈ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్లో వైరల్గా మారింది. ఈ హై-వోల్టేజ్ సినిమా సరికొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వైజాగ్ (విశాఖపట్నం) చేరుకుంది.
దర్శకుడు రాజమౌళి ఇప్పటికే తన కోర్ టెక్నికల్ టీంతో కలిసి వైజాగ్లో ల్యాండ్ అయ్యారు. అక్కడ షూటింగ్ చేయబోయే లొకేషన్లను జక్కన్న స్వయంగా పరిశీలించినట్లు సమాచారం. ఈ సరికొత్త షెడ్యూల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొనబోతున్నారు. వైజాగ్ చుట్టుపక్కల ఉన్న కొన్ని అత్యంత అందమైన, కాస్త అన్-ఎక్స్ప్లోర్డ్ లొకేషన్లలో మహేష్ బాబుపై కొన్ని కీలకమైన సన్నివేశాలను, భారీ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్ సినిమాలో ఒక మేజర్ ట్విస్ట్కు వేదిక కానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇటీవలే హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల వ్యయంతో వేసిన భారీ కాశీ (వారణాసి) సెట్ లో కొన్ని కీలకమైన సీన్లు తీశారు. ఆ తర్వాత స్వయంగా వారణాసి ఒరిజినల్ లొకేషన్లలో కూడా జక్కన్న కొన్ని సీన్లు షూట్ చేసి సినిమాకు రియలిస్టిక్ లుక్ తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు సడన్గా వైజాగ్ షెడ్యూల్ అనగానే కథలో సముద్ర తీరానికి ఇంపార్టెన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
Also read :కాంచన 4… నయనతార, పూజా హెగ్డేలతో లారెన్స్ భారీ ప్లాన్!
ఇదొక గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా. వారణాసిలోని రహస్యాల వేటలో భాగంగా హీరో సముద్ర మార్గం ద్వారా ప్రయాణించే సీన్స్ ఉంటాయని, అందుకే వైజాగ్ పోర్ట్ పరిసర ప్రాంతాలలో భారీ చేజింగ్ సీన్స్ ప్లాన్ చేశారని సమాచారం.రాజమౌళి సినిమా అంటే కేవలం విజువల్స్ మాత్రమే కాదు, క్యారెక్టర్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండటం సినిమాకు ఇంటర్నేషనల్ అప్పీల్ను తీసుకొచ్చింది. అలాగే, మలయాళ వర్సటైల్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, పృథ్వీరాజ్ మధ్య వచ్చే మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు మాంచి కిక్కిస్తాయని టాక్.
ఈ విజువల్ వండర్ను ప్రముఖ సీనియర్ నిర్మాత కే.ఎల్. నారాయణ సమర్పణలో, ఎస్.ఎస్. కార్తికేయ కలిసి నిర్మిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దించారు. అవతార్, మార్వెల్ సినిమాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయి. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో, దీనిపై హాలీవుడ్ మీడియా సైతం కన్నేసింది.
Also read :పవన్ కళ్యాణ్ ‘ఓజి 2’పై మైండ్ బ్లోయింగ్ లీక్.. షూటింగ్ డేట్ ఫిక్స్!
అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాయడానికి ‘వారణాసి’ రూపంలో జక్కన్న పెద్ద స్కెచ్చే వేశారు. మరి మహేష్ బాబును హాలీవుడ్ రేంజ్ లూక్లో చూపిస్తూ రాజమౌళి ఈసారి ఎలాంటి సరికొత్త రికార్డులు సృష్టిస్తారో చూడాలి!