E-Paper
Advertisement

ప్రేక్షకులకు సర్పైజ్ ఇచ్చిన రణ్ బీర్ కపూర్… ‘రామాయణ’లో డ్యూయల్ రోల్..

ప్రేక్షకులకు సర్పైజ్ ఇచ్చిన రణ్ బీర్ కపూర్… ‘రామాయణ’లో డ్యూయల్ రోల్..
Advertisement

Ranbir Ramayana: భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రణ్‌బీర్ ఒకే పాత్రకు పరిమితం కాకుండా, డబుల్ రోల్‌లో మెప్పించబోతున్నారు.

Read also-Rashmika: పెళ్లయిన తర్వాత రష్మిక ఖాతాలో అరుదైన ఘనత.. సంతోషంలో ఫాన్స్!

రెండు అవతారాల్లో రణ్‌బీర్

Advertisement

ఈ పౌరాణిక గాథలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడి పాత్రను కూడా పోషిస్తున్నారు. విష్ణుమూర్తి అవతారాలైన రాముడు, పరశురాముడు ఒకే తెరపై, అది కూడా ఒకే నటుడి రూపంలో కనిపించడం విశేషం. దీనిపై రణ్‌బీర్ స్పందిస్తూ.. “రామాయణంలో రాముడు మరియు పరశురాముడు వంటి రెండు శక్తివంతమైన పాత్రలను పోషించే అవకాశం రావడం నిజంగా గొప్ప అనుభూతి” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

హైలైట్‌ ఎంటంటే?

సినిమాలో పరశురాముడి పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథలో అది చాలా కీలకమైనది. ముఖ్యంగా సీతా స్వయంవరం ఘట్టంలో శివధనస్సు విరిగినప్పుడు పరశురాముడు ఆగ్రహంతో వచ్చే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ప్రశాంతంగా ఉండే రాముడి పాత్రకు, ఉగ్రరూపంలో ఉండే పరశురాముడి పాత్రకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రణ్‌బీర్ తన నటనతో ఎలా చూపిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హాలీవుడ్ స్థాయి విజువల్స్

Advertisement

దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల కోసం అగ్ర నటులను ఎంపిక చేశారు. సీతగా దక్షిణాది నటి సాయి పల్లవి. రావణుడిగా: కన్నడ స్టార్ యశ్. హనుమంతుడిగా యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్నారు.

Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. ఇక పూనకాలే..

విడుదల ఎప్పుడు?

దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం ఆస్కార్ గెలుచుకున్న సంస్థలతో పనిచేస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉండగా, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే కాకుండా, భారతీయ సినిమా రంగంలోనే ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×