E-Paper
Advertisement

Rashmika Mandanna: మనుషుల్లా ప్రవర్తించండి.. ఏఐ మార్ఫింగ్ ఫోటోలపై రష్మిక సీరియస్‌

Rashmika Mandanna: మనుషుల్లా ప్రవర్తించండి.. ఏఐ మార్ఫింగ్ ఫోటోలపై రష్మిక సీరియస్‌

Rashmika Reacts Misuse Of AI: ఏఐ.. ప్రస్తుతం హాట్టాపిక్గా ఉన్న అంశం. టేక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభమైంది. ఎంత కష్టమైన పనైకైనా.. ఈజీగా సోల్యూషన్దొరుకుంది. స్టూడెంట్స్నుంచి పెద్ద పెద్ద ఐటీ ఉద్యోగుల వరకు ఏఐ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు మన దేశం పూర్తిగా డిజిటల్ఇండియాగా మారిపోయింది. ఇది సంతోషించే విషయమే. అదే సమయంలో టెక్నాలజీ వల్ల సవాళ్లు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సినీస్టార్స్కి.

సీని తారలకు చేదు అనుభవం

ఏఐ(ఆర్టిఫిషియల్ఇంటలిజెన్స్‌) వల్ల డిజిటల్రంగం ఎంతగా అభివృద్ధి చెందుతుందో.. మరోవైపు సినీతారలకు అంత చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఏఐ ద్వారా నటీనటులను తమ ఇష్టమైన పాత్రల్లో తీర్చిదిద్దుతున్నారు. తారల ఫోటోలను తమకు ఇష్టమొచ్చినట్టు ఎడిట్చేస్తూ సోషల్మీడియాలో పోస్ట్స్చేస్తున్నారు. ఇందులో కొన్ని అబ్బా అనిపించేలా.. మరికొన్నిఅబ్బో అనిపించేలా ఉన్నాయి. ఇంకోందరైతే మితిమిరీ మరి ఫోటోలను ఎడిట్చేస్తున్నారు. వీటిలో మంచికంటే అసభ్యకరమైన కంటెంటే ఎక్కువగా ఉంటోంది.  వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఇందులో మొట్టమొదటి బాధితులు ఎవరంటే టక్కున చెప్పే పేరు రష్మిక మందన్నా.

టెక్నాలజీ అసభ్యతను పెంచడానికి కాదు

అమ్మాయి లిఫ్ట్లో వెళుతున్న వీడియోకి రష్మిక ఫోటోని మార్ఫింగ్చేసి వైరల్చేశారు. అప్పట్లో ఇది పెద్ద ఎత్తున దుమారం రేపింది. వీడియో సోషల్మీడియా, మీడియాలో హాట్టాపిక్గా మారింది. దీనిపై రష్మిక సైబర్క్రైంని కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రష్మిక తర్వాత మెగాస్టార్చిరంజీవి వంటి స్టార్హీరోలు కూడా దీని బాధితులే. అయితే ఏఐ దుర్వినియోగంపై రష్మిక మందన్నా స్పందించింది. మేరకు ఎక్స్లో పోస్ట్చేసింది. “టెక్నాలజీ అనేది మన అభివృద్ధి కోసం సృష్టించింది.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. “మనం సత్యాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుంది. కానీ కొందరు ఏఐని పురోగతికి కంటే అసభ్యతను సృష్టించడానికే ఎక్కువ వినియోగిస్తున్నారుఅని మండిపడింది.

వారిని కఠినంగా శిక్షించాలి

ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని దాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అలాంటి వ్యక్తులకు నైతికత లేదనేది స్పష్టమవుతుంది. వారంత ఒకటి గుర్తు పెట్టుకోవాలి. నిజానికి ఇంటర్నెట్ అనేది అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే ఓ కాన్వాస్‌. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా.. గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం. ఒకవేళ ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్సోషల్మీడియాలో చర్చనీయాంశమైంది. ఏఐ దుర్వినియోగం పట్ల రష్మిక స్పందించిన తీరు ప్రశంసనీయమని పలువురు నెటిజన్స్నుంచి రష్మికకు మద్దతు వస్తోంది.

Also Read: Mahavatar Narsimha Movie: పాక్‌ గడ్డపై మహావతార్‌ నరసింహా ప్రదర్శన.. భక్తి పారవశ్యంలో పాకిస్తానీలు‌

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

×