Rashmika Reacts Misuse Of AI: ఏఐ.. ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న అంశం. ఈ టేక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభమైంది. ఎంత కష్టమైన పనైకైనా.. ఈజీగా సోల్యూషన్ దొరుకుంది. స్టూడెంట్స్ నుంచి పెద్ద పెద్ద ఐటీ ఉద్యోగుల వరకు ఏఐ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు మన దేశం పూర్తిగా డిజిటల్ ఇండియాగా మారిపోయింది. ఇది సంతోషించే విషయమే. అదే సమయంలో ఈ టెక్నాలజీ వల్ల సవాళ్లు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సినీస్టార్స్కి.
ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వల్ల డిజిటల్ రంగం ఎంతగా అభివృద్ధి చెందుతుందో.. మరోవైపు సినీతారలకు అంత చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఏఐ ద్వారా నటీనటులను తమ ఇష్టమైన పాత్రల్లో తీర్చిదిద్దుతున్నారు. తారల ఫోటోలను తమకు ఇష్టమొచ్చినట్టు ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తున్నారు. ఇందులో కొన్ని అబ్బా అనిపించేలా.. మరికొన్నిఅబ్బో అనిపించేలా ఉన్నాయి. ఇంకోందరైతే మితిమిరీ మరి ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. వీటిలో మంచికంటే అసభ్యకరమైన కంటెంటే ఎక్కువగా ఉంటోంది. వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఇందులో మొట్టమొదటి బాధితులు ఎవరంటే టక్కున చెప్పే పేరు రష్మిక మందన్నా.
ఓ అమ్మాయి లిఫ్ట్లో వెళుతున్న వీడియోకి రష్మిక ఫోటోని మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. అప్పట్లో ఇది పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియా, మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై రష్మిక సైబర్ క్రైంని కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రష్మిక తర్వాత మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలు కూడా దీని బాధితులే. అయితే ఈ ఏఐ దుర్వినియోగంపై రష్మిక మందన్నా స్పందించింది. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ చేసింది. “టెక్నాలజీ అనేది మన అభివృద్ధి కోసం సృష్టించింది.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. “మనం సత్యాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుంది. కానీ కొందరు ఏఐని పురోగతికి కంటే అసభ్యతను సృష్టించడానికే ఎక్కువ వినియోగిస్తున్నారు” అని మండిపడింది.
“When truth can be manufactured, discernment becomes our greatest defence.”
AI is a force for progress, but its misuse to create vulgarity and target women signals a deep moral decline in certain people.
Remember, the internet is no longer a mirror of truth. It is a canvas where…— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025
“ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని దాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అలాంటి వ్యక్తులకు నైతికత లేదనేది స్పష్టమవుతుంది. వారంత ఒకటి గుర్తు పెట్టుకోవాలి. నిజానికి ఇంటర్నెట్ అనేది అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే ఓ కాన్వాస్. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా.. గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం. ఒకవేళ ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి“ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఏఐ దుర్వినియోగం పట్ల రష్మిక స్పందించిన తీరు ప్రశంసనీయమని పలువురు నెటిజన్స్ నుంచి రష్మికకు మద్దతు వస్తోంది.
Also Read: Mahavatar Narsimha Movie: పాక్ గడ్డపై మహావతార్ నరసింహా ప్రదర్శన.. భక్తి పారవశ్యంలో పాకిస్తానీలు