Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. వెంకీ కుడుముల దర్శకుడుగా పరిచయమైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో చేసిన గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా అప్పట్లో దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
తర్వాత విజయ్ హీరోగా డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ విజయ్తో మాత్రం రష్మికా కు మంచి బాండింగ్ ఏర్పడింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకు. ఆ తర్వాత మళ్లీ వెంకీ దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత రష్మిక రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది.
కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మికకు రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా కథనాలు కూడా వీళ్ళ గురించి వినిపించాయి. ఇక రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ సాధించింది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సక్సెస్మెంట్ నిర్వహించింది.
ఈ సక్సెస్ మీట్ లో రష్మిక మాట్లాడుతూ… ఈ కథను విన్నప్పుడు నేను ఈ సినిమాను ఫస్ట్ చేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే భూమా లైఫ్ లో ఏమేమి జరిగిందో, నా లైఫ్ లో కూడా కొన్ని అలాంటివి జరిగాయి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇదే మన అందరి లైఫ్ లో జరిగింది అని. జరిగేటప్పుడు నా లైఫ్ లో అయితే సుధీర్ లాంటి ప్రొఫెసర్ లేరు దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు. అంటూ చెప్పుకొచ్చింది.
ఈ సినిమాను చూస్తే రష్మిక మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో కొంతమేరకు అర్థమవుతుంది. సినిమాలో భూమా దేవి అనే క్యారెక్టర్ ను విక్రమ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బహుశా అలాంటి అనుభవం రష్మిక లైఫ్ లో జరగడం వలన ఇలా మాట్లాడిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కంట్రోల్ చేయడం అంటే అది ఒక రకమైన టార్చర్. దానినే గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రాహుల్ చూపించాడు. అయితే అలాంటి సంఘటనలు నా జీవితంలో జరిగాయి అని రష్మిక చెప్పడం వల్ల ఆంతర్యం ఏమిటో.
Also Read: SKN On Bandla : పేరు తీయకుండానే రెచ్చిపోయిన ఎస్కేఎన్, బండ్ల రియాక్షన్ ఏంటో?