Samantha:సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమా జీవితంతోనే కాకుండా పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తలో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తను జీవితంలో జరిగే ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెకు ఇంస్టాగ్రామ్ లో ఎన్నో మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా సమంత తన భర్త గురించి పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ సమయంలో సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడిన విషయం కూడా తెలిసిందే. ఆ సమస్య ఆమెకు పెద్ద పరీక్షగా మారింది. అయితే ఆమె ధైర్యంగా పోరాడి చికిత్స తీసుకుని మళ్లీ ఆరోగ్యంగా మారారు. అనారోగ్యం ఉన్నప్పటికీ ముందుగా ఒప్పుకున్న కొన్ని సినిమా ప్రాజెక్ట్లను పూర్తి చేయడం ద్వారా ఆమె తన నిబద్ధతను చూపించారు.
అంతేకాక హిందీలో వచ్చిన ది ఫ్యామిలీ మెన్ మరియు సిటాడెల్ వంటి వెబ్ సిరీస్ల ద్వారా సమంతకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్ల సమయంలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, తరువాత ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. చివరికి ఇద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత కూడా సమంత తన కెరీర్పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆమె తన నిర్మాణ సంస్థ ట్రాలాల పిక్చర్స్ ద్వారా మా ఇంటి బంగారం అనే సినిమా నిర్మిస్తూ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా సమంత ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆమె భర్త రాజ్ నిడిమోరు బెడ్రూంలో లాప్టాప్ ముందు కూర్చొని పని చేస్తున్నట్లు కనిపించారు. దీనిపై సమంత సరదాగా వ్యాఖ్య చేస్తూ ఆయన ఎంత కష్టపడి పని చేస్తారో చూడండి అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.
ALSO READ: Anirudh Ravichander: గ్లోబల్ డీల్కు ఓకే చెప్పిన అనిరుధ్.. బక్కోడి ప్లానే వేరయా!