E-Paper
Advertisement

ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్.. 48 గంటల్లోనే ఆ మూవీ బ్యాన్!

ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్.. 48 గంటల్లోనే ఆ మూవీ బ్యాన్!
Advertisement

Satluj Movie: ‘సత్లుజ్’ (Satluj) …దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది .నాలుగేళ్ల పాటు సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలని, కోర్టు వివాదాలను ఎదుర్కొని ఎట్టకేలకి జులై మూడున ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ Zee5 లో  సైలెంట్ గా  స్ట్రిమింగ్ కి వచ్చింది.అయితే వచ్చిన  48 గంటల్లోనే   ఇండియాలో బ్యాన్ అయిపోయింది ఈసినిమా .

ఒక రకంగా ఇండియన్ డిజిటల్ స్ట్రీమింగ్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఒక సినిమాని ప్లాట్ ఫామ్  నుంచి తొలగించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న పొలిటికల్ సోషల్ బ్యాక్ గ్రౌండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారాన్ని లేపుతుంది.నిజానికి ఈ కాంట్రవర్సీకి మెయిన్ రీజన్ సినిమా ఎంచుకున్న స్టోరీ .

Advertisement

వేలాదిమంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను

1984 నుండి 94 మధ్యకాలంలో పంజాబ్లో జరిగిన తీవ్రవాద అణిచివేతల నేపథ్యంలో  వేలాదిమంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పోలీసులు అక్రమంగా దహనం చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఈ దారుణ నిజాలను బయటపెట్టి అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లిన మానవ హక్కుల ఉద్యమకారుడు జశ్వంత్ సింగ్ కల్రా నిజజీవిత ఆధారంగా డైరెక్టర్ హనీ డెహ్రాన్ ఈ సినిమాని తెరకెక్కించాడు .1990లో ఖల్రా కూడా రహస్యంగా అదృశ్యమై ఆ తర్వాత హత్యకు గురైనట్లు తేలడం పంచాయతీ చరిత్రలోనే ఒక బ్లాక్ చాప్టర్ .

Advertisement

ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ ని టచ్ చేయడంతోనే ఈ సినిమా మొదటి నుండి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంది .వాస్తవానికి ఈ సినిమా జర్నీ అంత ఈజీగా సాగలేదు .మొదట ఈ సినిమాకి ‘ఘల్లుఘారా’ (Ghallughara)అనే హిస్టారికల్ టైటిల్ ని పెట్టారు మేకర్స్ .అయితే దీనికి సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో పాటు 21 కట్స్  విధించింది.

ఆడియన్స్ త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని హింట్

దీంతో మేకర్స్  కోర్ట్ మెట్లు ఎక్కడంతో  టైటిల్ పంజాబ్ 95 గా మార్చారు.20 23లో ద ఫేమస్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాని ప్రీమియర్ వేయాల్సినప్పటికీ అనేక పొలిటికల్ ప్రెజర్స్ వల్ల   చివరి నిమిషాల్లో సినిమా స్క్రీనింగ్ రద్దు చేశారు.ఇలా థియేటర్లో  రిలీజ్ దాదాపు అసాధ్యం కావడంతో ఇక ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్ గా అన్ కట్ వెర్షన్ ని Zee5 లోవదిలారు మేకర్స్ అయితే సినిమా రిలీజ్ సమయంలోనే దీనిపై బ్యాన్ చేసే అవకాశం ఉందని హీరో దిల్జీత్ దోసాంజ్ ముందే ఊహించారు. జులై 3న ఆయన ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి సోమవారానికల్లా జూలై 6 20 26 కల్లా ఈ సినిమాను తీసేసి ప్రమాదం ఉందని కాబట్టి ఆడియన్స్ త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని హింట్ కూడా ఇచ్చాడు .అయితే ఆయన భయపడినట్టుగానే ఆదివారం  Zee5 ఇండియాలో లింకులు నిలిపివేసింది.

ఇక ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితుల కారణంగా ఇక్కడ స్ట్రీమింగ్  కష్టమని అయితే విదేశాల్లో ఉండే Zee5 గ్లోబల్ ద్వారా అందుబాటులో ఉంటుందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది Zee5. దిల్జీత్ పంజాబీ లో ఎమోషన్ అవుతూ చేసే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారాయి .నన్ను ఇంత ఇబ్బంది పెట్టినా, చనిపోయే వరకు తాను పంజాబ్ హకుల కోసమే పోరాడుతానని కుండబద్దలు కొట్టేశాడు.ఇక సినిమా ఇప్పటికి ఇంటర్నెట్లోకి వచ్చేసిందని,  డౌన్ లోడ్ చేసుకొని అయినా సరే ప్రతి ఒక్కరు సినిమా చూడాలని కోరాడు.జస్వంత్ సింగ్ కల్రా చేసిన త్యాగం గురించి  దేశంలోని ప్రతి ఇంట్లో చర్చి జరగాలని తన ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.

గతంలో పంజాబ్లో నేపథ్యంలో వచ్చిన పంజాబ్ 1984,  ఉడ్తా పంజాబ్’వంటి సినిమాలు ఇలాంటి కాంట్రవర్సీలనే ఫేస్ చేసినప్పటికీ ‘సత్లుజ్ సినిమా చుట్టూ జరుగుతున్న ఈ 48 గంటల హైడ్రామా మాత్రం  సినీ ఇండస్ట్రీలో ఒక రికార్డు అని చెప్పాలి.

Related News

హాలీవుడ్ రేంజ్‌లో హనుమత్ సుందరకాండ… మరో ‘మహావతార్ నరసింహ అయ్యేనా ?

యానిమల్ డైరెక్టర్ రూట్ మార్చాడుగా.. వంగా మార్క్ ట్విస్ట్ తో ‘రోమాంచకం’ గ్లింప్స్ అరాచకం!

22 ఏళ్లకే రాలిపోయిన స్టార్ హీరోయిన్…అతనితో ప్రేమే కారణమా ?

ఈమధ్య కాలంలో ఇలాంటి పోస్టర్ చూశారా? మేకర్స్ కళ్ళు తెరిపిస్తున్న మెగాస్టార్ లేటెస్ట్ రికార్డ్!

‘లెనిన్’ పై సెటైర్లు.. అఖిల్ కెరీర్‌ను తారక్ నిలబెట్టగలడా?

టాలీవుడ్ టు కోలీవుడ్.. శివాజీ కీలక పాత్రలో ప్రదీప్ రంగనాథన్ ‘అల్ఫా!

ధనుష్ ‘పొలిటికల్’ స్క్రీన్ ప్లే.. విజయ్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్నారా?

Big Stories

Advertisement
×