Globetrotter : మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ను కనిపిస్తున్నారు. ఇప్పటికే పృధ్వీరాజ్ సుకుమారన్ కుంభా లుక్, అలానే ప్రియాంక చోప్రా నటిస్తున్న మందాకిని లుక్ అధికారికంగా ప్రకటించారు. రెండు లుక్స్ కూడా సోషల్ మీడియాలో డిస్కషన్స్ గా మారాయి.
పృధ్విరాజ్ లుక్ కి సంబంధించి చాలా ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. రాజమౌళి రేంజ్ లో లేదు అని చాలామంది కామెంట్స్ కూడా చేశారు. రాజమౌళి కొన్ని విషయాల్లో చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఊరికే అంచనాలు పెంచేయడంతో మళ్లీ తేడా కొడుతుంది అని గమనించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు బహుశా కుంభా విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది. మరోవైపు ప్రియాంక చోప్రా లుక్ స్టైలిష్ జేమ్స్ బాండ్ లా శారీలో డిజైన్ చేశాడు.
ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ నవంబర్ 15వ తారీఖున జరగనుంది. టాలీవుడ్ లో జరిగే పలు రకాల ఈవెంట్స్ కు యాంకర్ గా మొదటి వినిపించే పేరు సుమ. ఎంత పెద్ద ఈవెంట్ అయినా అలవోకగా సుమా చేసేస్తారు.
మహేష్ బాబు ఈవెంట్ కి సంబంధించి ఏకంగా ఇద్దరు యాంకర్లు ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇకపోతే సుమ ఎస్ఎస్ రాజమౌళి ఎంఎం కీరవాణి కలిసి ఈవెంట్ కోసం ప్లానింగ్స్ వేయడం ఇప్పటినుంచే మొదలుపెట్టారు.
వీలు ముగ్గురు కూర్చుని ఈవెంట్ గురించి డిస్కస్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు సుమ. ఆచరికరమైన విషయం ఏంటంటే సుమ చైర్ పైన కూర్చున్నారు. సుమ ముందు ఎస్ ఎస్ రాజమౌళి మరియు ఎం ఎం కీరవాణి కింద కూర్చున్నారు.
Let's begin the show 😉#Globetrotter pic.twitter.com/IyDeTaBITy
— Suma Kanakala (@ItsSumaKanakala) November 13, 2025
సుమ కూర్చునే విధానం చూస్తుంటే అచ్చం బాహుబలి సినిమాలో శివగామి మాదిరిగానే ఉన్నారు. కొంతమంది బాహుబలి సినిమాలోని రమ్యకృష్ణ ఫోటోలు షేర్ చేస్తూ శివగామి అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి వీలు ముగ్గురు కలిసి భారీగానే ఏదో ప్లాన్ చేస్తున్నారు అని ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు. అలానే ఈవెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అభిమానులు కూడా ఎస్ఎస్ రాజమౌళి పిలుపునిచ్చారు. ఈ ఈవెంట్ తర్వాత సినిమా గురించి ఒక క్లారిటీ వస్తుంది.
Also Read: Vijay Devarakonda : నా గురించి ఎవరైనా మాట్లాడితే నేను ఎదురు తిరుగుతా