SS Rajamouli Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. రాజమౌళి టీవీ సీరియల్స్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి ఇప్పటివరకు తన కెరియర్లో సుమారు 12 సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు అయితే రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఏవి ప్రేక్షకులను నిరాశపరచలేదు.
ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారనే టాక్ ఉంది. ఇదివరకు మన ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేనివిధంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా దాదాపు సగభాగం షూటింగ్ పూర్తి అయినట్టు ఇటీవల రాజమౌళి వెల్లడించారు. మరొక 7- 8 నెలలలో షూటింగ్ పూర్తి అవుతుందని తెలియజేశారు.
తాజాగా రాజమౌళికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి డైరెక్షన్లో వారణసి సినిమా ఆఖరి సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా అనంతరం రాజమౌళి సినిమాలు చేయరనే విషయం సోషల్ మీడియాలో వైరాల్ గా మారడంతో ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు రాజమౌళి సినిమాలు చేయకపోవడం ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి వారణాసి సినిమా తరువాత మహాభారతం కోసం పని చేయబోతున్నారని సమాచారం. అయితే ఇది సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అత్యంత భారీ బడ్జెట్ సిరీస్ గా మహాభారతం గేమ్స్ ఆఫ్ త్రోన్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. మరి రాజమౌళి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇందులో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా,పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్, మాధవన్ వంటి వారు కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని సమాచారం.
Also Read: Anaganaga Oka Raju : సినిమాకు నిర్మాత నాగవంశీ ఇంప్రెస్.. డైరెక్టర్కి కాస్ట్లీ వాచ్ గిఫ్ట్